జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. బుల్లితెర ప్రేక్షకులతో పాటు వెండితెర ప్రేక్షకులకు కూడా రెష్మీ గైతమ్ సుపరిచితమే. అయితే తెలుగులో అడపాదడపా ఎన్నో సినిమాల్లో పాత్రలు చేసిన రష్మీ గౌతమ్కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఎపుడైతే జబర్థస్త్ అంటూ రష్మీ చేసిన యాంకరింగ్కు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోంగ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం హాట్ యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఏదో విధంగా రష్మీ గౌతమ్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
సోషల్ మీడియాలోనూ ఈమె చాలా యాక్టివ్గా ఉంటుంది. వాస్తవానికి జబర్దస్త్ తర్వాత ఆమె కెరీర్ మారిపోయిందని చెప్పాలి. రూపురేఖలు మారిపోయి ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ షోలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. గురువారం మరియు శుక్రవారం వచ్చాయి అంటే బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఎందుకంటే ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే “జబర్దస్త్” మరియు “ఎక్స్ట్రా జబర్దస్త్” ప్రోగ్రామ్స్ లో పండించే కామెడీకి అంత క్రేజ్ ఉంది కాబట్టి.
ఇక ఈ షోలు ప్రసారవమడానికి ముందుగానే ప్రోమోలు విడుదల చేసి మంచి హైప్ క్రియేట్ చేస్తారు. ఈ క్రమంలోనే ఎక్ట్స్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ తాలూకా ప్రోమో బయటకొచ్చి యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఈ వారం కామెడీలో డోస్ ఫుల్గా ఉందని ప్రోమో చూస్తేనే అర్థం అవుతంది. అయితే ఇందులో బులెట్ భాస్కర్ చేసిన స్కిట్ హైలైట్ గా నిలిచినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాను కొన్ని అవార్డులు ఇవ్వాలని భావించాడు. అందులో ఉత్తమ తెలుగు యాంకర్ అవార్డును రష్మీ దక్కించుకుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. రష్మీ గెటప్ లో నరేష్ వచ్చి హిలేరియస్ కామెడీ పండించాడు. సో.. ఈ హాట్ యాంకర్ ఇలా ఉత్తమ తెలుగు యాంకర్ అవార్డును అందుకుందన్నమాట.