స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. డీసెంట్ కలెక్షన్స్ తో మొదలైన ఈ చిత్రం సంక్రాంతి అడ్వాంటేజ్ ను ఫుల్లుగా ఉపయోగించుకుని రోజురోజుకీ కలెక్షన్స్ మరింత పెరుగుతూ మొత్తానికి ఇండస్ట్రీ హిట్ అయింది. నాన్ బాహుబలి కేటగిరీలో ఈ చిత్రం రికార్డ్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సక్సెస్లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
ఇప్పటికీ కూడా థియేటర్స్ లో హవా కొనసాగిస్తున్న ఈ చిత్రం ఇక డిజిటల్ రంగంలో కూడా స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని ఈ ఫిబ్రవరి 26 నుంచే అందుబాటులోకి వచ్చేయనుంది అని అధికారిక వార్తలే బయటకు వచ్చాయి. అలాగే గతంలో ఈ చిత్రాన్ని అంత త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకు రామని చెప్పి నెల గడిచిన తర్వాత తీసుకొచ్చేసి షాకివ్వగా సరేలే అని చెప్పి బన్నీ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ సినిమా చూసేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు సన్ నెక్ట్స్ వారు అటు ప్రేక్షకులకు ఇలు బన్నీ ఫ్యాన్స్ కు మరో ఊహించని షాక్ ఇచ్చారు.
ఇన్ని రోజులూ సినిమాను ఎప్పటి నుంచి స్ట్రీమ్ చేస్తామో డేట్ వేసి మరీ చెప్పిన వీరు జస్ట్ కొన్ని గంటల క్రితమే “అల వైకుంఠపురములో” కమింగ్ సూన్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఇది చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా ఫ్యుజ్ లు ఎగిరిపోయాయి. దీంతో ఈ చిత్రం స్ట్రీమింగ్ రేపు లేనట్టే అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. అయితే దీనికి గల కారణాలు కూడా తెలుస్తున్నాయి. నిజానికి ఈ చిత్రం ఇంకా థియేటర్స్ లో అదరగొడుతుంది ఇలాంటి సమయంలో అప్పుడే స్ట్రీమింగ్ కు తీసుకురావద్దని కొందరి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతేనేం.. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.