ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే తమిళ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్.. ఈ మధ్యే టీవీ షో చేసాడు. ఈ క్ర‌మంలోనే బుల్లితెరపై త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ర‌జినీ. డిస్కవరీ ఛానెల్ చూసే వారికి 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షో గురించి తెలిసే ఉంటుంది. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్ట్ తో ఈ షోని నడిపిస్తుంటాడు. ఈ షోని మొత్తం నడిపించే బేర్ గ్రిల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బేర్ గ్రిల్స్, మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ... సాహసాలు చేస్తుంటాడు. 

 

ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అయితే మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా బేర్‌ గ్రిల్స్‌తో కలిసి నెల క్రితమే రజనీ అడవిబాట పట్టాడు. అక్కడే రెండు రోజులపాటు వన్య మృగాల ఆవాసంలో గడిపాడు. దీనికి సంబంధించి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తియింది. త్వరలో డిస్కవరీ ఛానెల్ లో రజనీ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి ముందుగానే బేర్ గ్రిల్స్‌తో రజనీ అడ్వెంచర్ వైల్డ్ జర్నీకి సంబంధించి ఫస్ట్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. 

 

ఇక బేర్ గ్రిల్స్ ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో.. అలాగే మన దేశం నుంచి ప్రధాని నరేంద్ర మోడీతో చేసిన ఎపిసోడ్ లు రికార్డు స్థాయి టీఆర్పీ ను సాధించాయి. ప్ర‌స్తుతం అంద‌రి చూపులు రజినీ తో ప్లాన్ చేసిన లేటెస్ట్ ఎపిసోడ్ పై ప‌డ్డాయి. వచ్చే మార్చ్ 23 న టెలికాస్ట్ కాబోయే ఈ ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ రానుంది అని తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటికే ఈ షో కు సంబంధించి సోషల్ మీడియాలో 228 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లు నమోదు కావడంతో పాటుగా వార్తలతో కలిపి ఏకంగా 1.10 బిలియన్ల ఇంప్రెషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనిని బ‌ట్టీ చూస్తుంటే.. ఎన్ని కోట్ల మంది ఈ షోను వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారో క్లారిటీగా అర్థం అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: