ఒక‌ప్పుడు పండగలు వ‌చ్చిన‌ప్పుడు కొత్త సినిమాలు వేసుకుని వాటి ద్వారా టీఆర్పీలు పెంచుకునేవి టీవీ ఛానల్స్.. ఇప్పుడు షోలు, స్పెషల్ ఈవెంట్లతో నానా ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈటీవీ అయితే ఏ పండ‌గ వ‌చ్చినా.. అదిరిపోయే ఈవెంట్లు ప్లాన్ చేస్తూ టీఆర్పీ రేటింగ్స్ అమాంతం పెంచుకుంటున్నాయి. వాస్త‌వానికి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కు మన తెలుగులో ఈటీవీ ఛానెల్ కేరాఫ్ అడ్రెస్. ఒక్క ఇంచు కూడా తగ్గకుండా ప్రతీ వారం వారం అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను ఈటీవీ తమ షోల ద్వారా మరియు పండ‌గ‌ల‌కు పలు ఈవెంట్ల ద్వారా అదరగొడుతుంది.

 

ఇక ఇప్పుడు ఉగాది కానుకగా ఈటీవీ వారు ‘పండగ సర్ పండగ అంతే’ అనే స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఈ ఈవెంట్‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్‌లో ఎవరైతే ఈ ఈవెంట్లో బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకుంటారో వాళ్లకి ఛాన్స్ ఇస్తారు అన్న కాన్సెప్ట్ మీద ఈ ఈవెంట్‌ను బిల్డ్ చేశారు. ఇక తాజాగా విడుద‌లైన  ప్రోమో కోసం మాట్లాడినట్టయితే పేరుకు తగ్గట్టే వేరే లెవెల్లో ఉండబోతుంది అని చెప్పాలి.

 

సినిమా టీజర్లకు వచ్చే రెస్పాన్స్ ఈ ఈవెంట్ లేటెస్ట్ ప్రోమో రాబట్టుకుంది. ఈ ప్రోమోలో నాన్ స్టాప్ కామెడీతో పాటుగా శేఖర్ మాస్టర్,సుధీర్ హైపర్ ఆది ఇలా వీరందరితో మరోసారి అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ లతో పాటుగా సుధీర్ మరియు ఆదిలతో పాటలు కూడా డిజైన్ చేసారు. దీంతో ఈ ప్రోమో ఊహించని విధంగా కేవలం 19 గంటల్లో 3 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చెయ్యడమే కాకుండా ఇప్పుడు అతి త‌క్కువ‌ గంటల్లో 3.2 మిలియన్ వ్యూస్ ను టచ్ చేయ‌డం విశేషం. ఏదేమైనా ఈ సారి ఉగాది పండ‌గ‌కు వ‌చ్చే పండగ సర్ పండగ అంతే ఈవెంట్ ఖ‌చ్చితంగా వీర లెవ‌ల్లో ఉంటుంద‌ని అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: