సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన అనుష్క శెట్టి.. గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భాగమతి చిత్రం త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క.. ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో.. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ క్రాస్ ఓవర్ మూవీ ఇది. అలాగే  ఆర్.మాధవన్, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడిసన్ తదితరులు ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. 

 

ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ చేప‌ట్టింది చిత్ర‌టీం. ఈ క్ర‌మంలోనే అనుష్క మ‌రియు అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, హేమంత్ మధుకర్‌లు  ఈటీవీ మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో ఒకటైన “క్యాష్” ప్రోగ్రాంకు వ‌చ్చి సంద‌డి చేయ‌నున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఇందులో ముందుగా మహారాణి దేవసేనకు క్యాష్ రాజ్యానికి స్వాగతం సుస్వాగతం అంటూ ఖడ్గం అందించింది సుమ. కత్తి అందుకుని గిరాగిరా తిప్పుతూ అనుష్క గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఎంతగానో ఆక‌ట్టుకుంది. 

 

అలాగే ఈ ప్రోమోలో ఇందులో ప్రభాస్‌ గురించి ఏదైనా చెప్పమంటే నా కొడుకు గురించా? అని అడగడం, అనుష్క కన్నీరు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అయితే అనుష్క కన్నీరు పెట్టడంతో సెట్‌లో అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇక ప్ర‌స్తుతం అనుష్క వ‌చ్చిన ఈ షో ప్రోమో జ‌ట్ స్పూడ్‌తో యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ ప్రోమో ఇప్పటికే రికార్డుస్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం 12 గంటల్లోనే దాదాపుగా 15 లక్షల వ్యూస్ తో పాటు, 50000 లైక్స్ ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ ప్రోమో కే ఇన్ని వ్యూస్ వస్తే, ఇక పూర్తి ఎపిసోడ్ తో ఇంకెన్ని రికార్డులు రాస్తారో వేచి చూడాల్సిందే. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: