యాంకర్ రవి, శ్రీముఖి వంటవాళ్లు అయ్యారు.. లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా ఇళ్లలో ఉండే వీళ్ళు వంటలు చేస్తూ వాటిని వీడియోస్ తీస్తూ కాలం గడిపేస్తున్నారు. రవి బోటి కర్రీ చేశాడు.. శ్రీముఖి చికెన్ బిర్యానీ చేసింది. అయితే ఓకేచోట కాదు.. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు చేశారు.. హిట్ అయ్యారు.. 

 

ఇన్నాళ్లు షూటింగ్ లలో సమయాన్ని గడుపుతు బిజీ బిజీగా ఉన్న వారు అంత కూడా ఇప్పుడు ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యమా అని ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. వారికీ వచ్చిన వంటలను ప్రేక్షకులకు చూపిస్తున్నారు.. యాంకర్ రవి అమ్మమ్మ సుశీలమ్మ చేసే కర్రీని ఆమె స్టైల్ ఎలా తయారు చేయాలో చూపిస్తూ ఒక వీడియోను యూట్యూబ్ లో పెట్టాడు.  

 

ఇంకా ఈ బోటి కర్రీ పై రవి మాట్లాడుతూ.. ''ఈరోజు నాకెంతగానో ఇష్టమైన బోటి కర్రీ చేస్తాను. బోటి తినడం మా అమ్మమ్మ అలవాటు చేసింది నాకు. చిన్నప్పుడు బోటి అంటే యాక్ అనేవాడిని. కానీ, ఒకసారి తిన్న తరవాత ఎంతో ఇష్టం ఏర్పడింది. ప్రతిసారీ బోటి తిన్నప్పుడు మా అమ్మమ్మే గుర్తొస్తుంది. మా అమ్మమ్మ పేరు సుశీలమ్మ.. ఇంకా ఆరోగ్యంగా ఉంది. ఈరోజు ఈ బోటి కర్రీని మా అమ్మమ్మకు అంకితమిస్తున్నా. ఈ బోటి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఎలా తెచ్చుకున్నాం అనే పంచాయతీలన్నీ వేస్ట్. లాక్‌డౌన్ పీరియడ్‌లో కూడా ఒక సప్లయర్ ఉన్నాడు. ఇంటి బయటకు తెచ్చి ఇచ్చాడు. మంచిగా కడుక్కొని చేస్తున్నాను'' అంటూ జోకులు వేస్తూ వీడియో తీశాడు రవి.

 

ఇంకా శ్రీముఖి కూడా సేమ్ అలానే ఇంట్లోనే ఉండి.. కిచెన్ లోకి దూరి చికెన్ బిర్యానీ చేసేసింది. అది తినగలమో లేదు తెలీదు కానీ చూడటానికి మాత్రం ఆ వంటకం సూపర్ గా ఉంది. అయితే బిర్యానీ వంటకంపై శ్రీముఖి మాట్లాడుతూ ''ఈరోజు నేను చాలా పెద్ద సాహసం చేయబోతున్నాను. చికెన్ బిర్యానీ వండబోతున్నాను. నాకు కుకింగ్ అంటే ఇష్టమని మీ అందరికీ తెలుసు. అయితే, నా స్నేహితులు, నా సోషల్ మీడియా మేనేజర్ నన్ను ఒక కుకింగ్ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టమని నాకు సలహాలు ఇచ్చారు. కానీ, నేను బిగ్ బాస్ హౌస్‌లో వంట చేయడం మీరంతా చూసారు. దీనిలో కొత్తేమీ లేదని నా ఫీలింగ్. కానీ, రెసిపీవైజ్ వివరంగా కలపడం, వండటం మీరు చూడలేదు కాబట్టి మీకు చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను'' అని శ్రీముఖి చికెన్ బిర్యానీ వండి చూపించింది.. ఈ వంటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: