రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జబర్దస్త్ పకపకలు గత ఏడేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. రోజా, నాగబాబులు ఈ షోకి జడ్జ్‌లుగా వ్యవహరిస్తుండగా.. జబర్దస్త్ షోకి అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కి రష్మిలు యాంకర్లుగా సేవలందిస్తున్నారు.

జబర్దస్త్‌ షో ద్వారా షకలక శంకర్, హైపర్ ఆది, అదిరే అభి, చమ్మక్ చంద్ర, రైజింగ్ రాజు, సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాం ప్రసాద్ ఇలా డజన్ల కొద్దీ కమెడియన్స్ లైఫ్ గాడిన పడింది. అయితే ప్రస్తుతం ఈ జబర్దస్త్ కామెడీ షో కళ తప్పబోతుంది. జబర్దస్త్ కామెడీ షోకి ధీటుగా.. జీ తెలుగు ‘గ్యాంగ్‌ స్టార్స్‌’ అనే ప్రోగ్రామ్‌ను భారీ ఎత్తున ప్రారంభించనుంది. అయితే ఈ షో కోసం జబర్దస్త్ యాంకర్ అనసూయతో పాటు.. జడ్జ్ నాగబాబు, హైపర్ ఆదిలను సైతం ఇప్పటికే లాగేసిందట జీ తెలుగు. వీరితో పాటుగా సుడిగాలి సుధీర్, ప్రదీప్‌లను జీ తెలుగు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకువస్తున్నారు. రవి, సుధీర్, హైపర్ ఆదిలో ముగ్గురూ ఈ షో‌కు హోస్ట్ చేయబోతున్నారు. ఇక అనసూయను కూడా యాంకర్‌గా రంగంలోకి దించబోతున్నారట.

అయితే మల్లెమాల యూనిట్ అనసూయ జబర్దస్త్ నుండి ఔట్ కాగానే.. ఆమె స్థానంలో శ్రీముఖి రంగంలోకి దించబోతున్నారట . అయితే గతంలో ఈటీవీ ‘పటాస్’ షో నుండి అర్ధాంతరంగా తప్పుకుని స్టార్ మా వారి బిగ్ బాస్‌కి వెళ్లిన శ్రీముఖిని మళ్లీ ఈటీవీలోకి తీసుకురావడం అనుమానంగానే అనిపిస్తోంది. అయితే అనసూయ ప్లేస్‌ను భర్తీ చేయాలంటే.. మళ్లీ రేటింగ్‌ను ఆ స్థాయిలో దున్నుకోవాలంటే రంగమ్మత్త ప్లేస్‌లో రాములమ్మ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. అందుకే ‘పటాస్’ అనిపించిన శ్రీముఖితో జబర్దస్త్ కామెడీ చేయించబోతున్నారట.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరువాత శ్రీముఖి ప్రస్తుతం ఎలాంటి షోలు చేయడం లేదు. అయితే త్వరలో స్టార్ మా శ్రీముఖితో పెద్ద షో ఒకటి ప్లాన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. దీనికి రాములమ్మ ఓకే చేయడం కూడా జరిగిపోయిందట. అసలే బిగ్ బాస్ షో‌తో శ్రీముఖికి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు భారీ హంగామాతో ఈ షోను ప్లాన్ చేశారట. ఒక వైపు జబర్దస్త్, మరోవైపు స్టార్ మా వారి బిగెస్ట్ క్రేజీ షో.. ఈ రెండింటిలో రాములమ్మ ఎటువైపు వెళ్తుందన్నది బుల్లితెర వర్గాల్లో ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: