నేడు వెండితెరపై చలనచిత్రం లాగానే టెలివిజన్ కూడా అత్యంత వేగంగా ప్రజా హృదయాలపై ముద్రవేసి కొన్ని సార్లు మనసుల్లొ నిలిచి ఉండే కార్యక్రమాలకు నాంది ఔతుంది. టెలివిజన్ చాలా పవర్ఫుల్ మీడియా గా మారింది. వెండి తెర స్టార్స్తో సమానం గా బుల్లి తేర స్టార్స్ కూడా ప్రజల్లో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించు కుంటున్నారు.
ఈ నేపథ్యంలో వెండితెర ఆరాధ్యదైవాలైన కథానాయకులు బుల్లితెర మీద కు రావడానికి సంకోచించడం లేదు. అంటే బుల్లి తెర స్థాయి ఎంతగా ఎదిగిపోయిందో తెలుస్తూనే ఉంది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. అమితాబ్, సల్మాన్, ఆమిర్ వంటి బాలీవుడ్ స్టార్లు బుల్లితెర మీదా సత్తా చాటారు. ముఖ్యంగా 'కౌన్ బనేగా కరోడ్పతి' అమితాబ్ బాలీ వుడ్ బుల్లి తెరను ఏలేశారు.
టలీవుడ్ లో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వెండితెర మీద స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న నాగార్జున, చిరం జీవి వంటి టాప్ హీరోలు బల్లితెర మీదా మెరిశారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. బుల్లితెరపై పై తన పవరేమిటో చూపే తన సత్తా చాటడానికి సిద్ధమైపోతున్నారు.
హిందీలో సూపర్ హిట్ రియాల్టీ షోగా నిలిచిన "బిగ్బాస్" లాంటి ’ప్రోగ్రామ్ ఒక దానిని "స్టార్-మా" ఛానెల్ రూపొందిస్తోంది. ఈ ప్రోగ్రామ్కు వ్యాఖ్యాతగా ఎన్టీయార్ వ్యవహరించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈవిషయమై ఛానెల్ యాజమాన్యంతో ఎన్టీయార్ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ విషయాన్ని సదరు ఛానెల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
కాగా ఇప్పటికే అక్కినేని నాగార్జున మా టీవీలో "మీలో ఎవరు కోటీశ్వరుడు" ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర పై అడుగు పెట్టి తనదైన శైలిలో మెప్పించారు కూడా. ఇప్పుడీ కార్యక్రమాన్ని మెగాస్టార్ బుల్లితెరపై నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే తమిళంలో అగ్ర నటుడు కమల్ హాసన్ "బిగ్ బాస్" కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే.
ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా చేస్తూ అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఇప్పుడు బుల్లితెరమీద రెగ్యులర్గా కని పించనుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇక తమను రోజూ అలరించ బోతున్నా డంటూ ఆనందపడుతున్నారు. నిజంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గొప్ప శుభవార్తే అని చెప్ప వచ్చు. బిగ్ బాస్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ షో కు ఎన్టీఆర్ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.