స్టార్ హీరోలు ఇక ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నడుం బిగించారు. ఇప్పటికే స్టార్ మాలో మీలో ఎవరు కోటిశ్వరుడు మూడు సీజన్లలో కింగ్ నాగార్జున అలరించగా నాలుగో సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేసి ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. ఇక ఇప్పుడు ప్రెస్టిజియస్ షో బిగ్ బాస్ ను కూడా రీజనల్ లాంగ్వేజెస్ కు విస్తరించే క్రమంలో తెలుగులో కూడా ఆ ప్రోగ్రాం చేయబోతున్నారు.


ఈ ప్రోగ్రాం కు హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు గాను తారక్ 7 నుండి 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. స్మాల్ స్క్రీన్ లో కూడా ఎన్.టి.ఆర్ సత్తా ఏంటో ఈ రెమ్యునరేషన్ తో ప్రూవ్ అయ్యింది. ఇప్పటికే కమల్ హాసన్ తమిళంలో హోస్ట్ గా వ్యవహరిస్తుండగా తెలుగులో తారక్ ను ఒప్పించేశారు స్టార్ మా యాజమాణ్యం.


ఇప్పటిదాకా సిల్వర్ స్క్రీన్ మీదే తన నట విశ్వరూపంతో అదరగొట్టిన తారక్ ఇక నుండి స్మాల్ స్క్రీన్ మీద కూడా తన టాలెంట్ చూపించనున్నాడు. బాద్షా బుల్లితెర మీదకు వచ్చేస్తున్నాడు అనగానే ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది. ప్రస్తుతం బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్న తారక్ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నాడు.


స్మాల్ స్క్రీన్ పై ఇప్పటికే పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించ్యిన అందరి తెలుగు స్టార్స్ ముఖ్యంగా ఎం.ఈ.కె లో చిరు తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా భారీ మొత్తంగా తారక్ డిమాండ్ చేస్తున్నాడట. క్రేజ్ ఉంది కాబట్టి అతనికి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి బిగ్ బాస్ గా చేసేస్తున్నారు స్టార్ మా వారు.



మరింత సమాచారం తెలుసుకోండి: