షో ప్రారంభం కావడానికి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. బిగ్ బాస్ 3 కోసం బుల్లి తెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు వెళ్తున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో లోకి ఎవరు వెళ్తారా అనేది అటు యాజమాన్యం ఇటు కంటెస్టెంట్ లు కూడా సీక్రెట్ గా ఉంచుతున్నారు.


ఇదిలా ఉండగా తాజాగా ఓ ప్రముఖ యాంకర్ బిగ్ బాస్ షో లోకి తన ఎంట్రీ ని కన్ఫామ్ చేసింది. అ యాంకర్ ఎవరో కాదు, ఓ ఛానల్ లో వచ్చే తీన్మార్ షో తో అందరినీ తన తెలంగాణ యాసతో కట్టిపడేసిన సావిత్రక్క అలియాస్ శివజ్యోతి బిగ్ బాస్ షో లోకి వెళ్లనుంది. ఈ విషయాన్నీ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది.


తను న్యూస్ ఛానల్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలనూ చెప్పడంతో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నట్లు కూడా చెప్పింది. అయితే కారణాలేంటో తెలియవు కానీ ఈ వీడియోను మాత్రం తరవాత ఆమె తొలగించింది. అయితే అప్పటికే ఆ వీడియో వైరల్ కావడంతో సావిత్రి బిగ్ బాస్ ఎంట్రీ కన్ఫామ్ అయిందని అనుకోవచ్చు.


ఈ సారి బిగ్ బాస్ షో లోకి 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొననున్నారు. వంద రోజుల పాటు జరిగే ఈ షో లో సావిత్రి తో పాటు మరొక హాట్ యాంకర్ శ్రీముఖి, నటి హేమ, వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్ జాఫర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పున్నర్నవి భూపాలన్, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంకా మరికొంత మంది పాల్గొనబోతున్నట్లు సమాచారం.


ఇది ఇలా ఉండగా రోజు రోజుకు ఈ షో పై జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్త తమను లైంగికంగా వేధించారనే ఆరోపణలు కూడా సెన్సేషన్ చేస్తున్నాయి.ఇన్ని సెన్సేషన్స్ తో మూడు రోజులలో ప్రారంభం అవ్వబోతున్న ఈ షో కోసం ఎదురు చూస్తున్న  ప్రజలకు ఎలాంటి ఊరటనిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: