బుల్లితెరపై సుడిగాలి సుధీర్ చేస్తున్న రచ్చ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఏ ఛానెల్ చూసినా కూడా ఆయనే కనిపిస్తున్నాడు. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ యాంకర్‌గా దుమ్ము దులిపేస్తున్నాడు సుధీర్. ఆయనతో పాటు ప్రదీప్ లాంటి వాళ్లున్నా కూడా సుధీర్ ఉంటే ఆ మజా వేరు.. కామెడీ వేరు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు ఈయన. ఈటీవీలో వచ్చే చాలా కార్యక్రమాలకు తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్. అందులో ఢీ ఛాంపియన్స్ కూడా ఉంది. అందులో ప్రదీప్‌తో కలిసి సుధీర్ చేసే కామెడీ అదిరిపోతుంది. డాన్స్ షో అయినా కూడా నవ్వులకు కూడా ఢోకా లేకుండా ఉంటుంది.


అయితే వచ్చే వారం నుంచి ప్రదీప్ ఇందులో కనిపించడం లేదు. మూడేళ్లుగా ఈ షో చేస్తున్న ప్రదీప్ ఇప్పుడు దీని నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఆయన స్థానంలో సుధీర్, రష్మీ యాంకర్స్ అయిపోయారు. ఇన్నిరోజులు టీం లీడర్స్‌గా ఉన్న సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ ఇప్పుడు హోస్టులుగా మారిపోయారు. వాళ్ల స్థానంలోకి రవి రీ ఎంట్రీ ఇచ్చాడు.


నిహారిక యాంకర్‌గా ఉన్న సమయంలో లాస్యతో కలిసి ఢీ చేసాడు రవి. ఆ తర్వాత సుధీర్, రష్మి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రదీప్ వెళ్లిపోవడంతో వర్షిణితో కలిసి ఢీ ఛాంపియన్స్‌కు టీం లీడర్‌గా వచ్చాడు రవి. ఈ మార్పుతో ఢీ రేటింగ్స్ కూడా మారిపోతాయనే టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి చూడాలిక.. ఈ మార్పు ఎలాంటి మార్పుకు దారి తీస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: