ఊహించిన విధంగానే నిన్న బిగ్ బాస్ నుండి పునర్నవి ఎలిమినేట్ కావడం జరిగింది. మొత్తం ఎలిమినేషన్ కొరకు నామినేట్ కాబడిన నలుగురు సభ్యులలో రాహుల్,మహేష్,వరుణ్ సేఫ్ కాగా పునర్నవి మాత్రం ఎలిమినేట్ కాబడి ఇంటిదారి పట్టింది. ఇక హౌస్ లో మిగిలింది కేవలం ఎనిమిది సభ్యులు. వరుణ్, వితిక, శివజ్యోతి, శ్రీముఖి,రాహుల్,మహేష్, బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లో సభ్యులుగా కొనాగుతున్నారు.

 

పునర్నవి ఎలిమినేషన్ తో రాహుల్ ఎమోషనల్ గా బాధపడ్డారు. ఏదేమైనా హౌస్ లో పునర్నవి ఎలిమినేషన్ తో గ్లామర్ డోస్ తగ్గింది. ఇక ముగ్గురు ఆడవాళ్ళూ, ఐదుగురు మగవాళ్ళతో షో కొనసాగనుంది. బిగ్ బాస్ షో విజయంలో కుర్ర జంటల మధ్య రొమాంటిక్ సంభాషణలు, బంధాలు, అలాగే కొంచెం గ్లామర్ పాళ్ళు అవసరం అనేది అందరికీ తెలిసిన విషయం. మరి పునర్నవి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ షో లో ఆ యాంగిల్ మిస్సవుతున్నట్లే.

 

ఎందుకంటే రాహుల్, పునర్నవి బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ జంటగా కొనసాగుతుండగా, ఆమె ఎలిమినేషన్ తో ఆ జంట విడిపోయినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: