11 వ వారం పునర్నవి ఎలిమినేట్ కావడంతో జస్ట్ మిస్ అయ్యాడు
మహేష్ విట్టా. బిగ్ బాస్ హౌస్లో సీమ యాసలో మహేష్ పలికించే పంచ్లు మళ్లీ మళ్లీ వినేట్టుగా అనిపిస్తాయి. ఇక తొలి ఎపిసోడ్ నుండి బాబా భాస్కర్కి నమ్మిన బంటులా ఉన్న మహేష్.. 11 వ వారానికి చేరుకునేటప్పటికి బిగ్ బాస్ హౌస్లో నారదుడి బ్రదర్లా తయారయ్యాడు.మొదట్లో ఉన్నది ఉన్నట్టు ముఖంమీద చెప్పేసే మహేష్.. మెల్లమెల్లగా తన
గేమ్ స్టాటజీ మార్చుకున్నాడు.
నామినేషన్ కోసం సోమవారం నాడు నిర్వహించిన ట్రాలీ టాస్క్లో ఓడిపోయి నామినేషన్కి వెళ్లొచ్చాక అతను వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. నిన్న మొన్నటి వరకూ గురువు గురువు అన్న బాబా భాస్కర్ని మిత్రద్రోహి అనేశాడు. ‘మిత్రలాభం’ అంటే ఏంటో అనుకున్నా ఇలాగా కూడా వాడొచ్చా.. అంటూ బాబా భాస్కర్ను ఉద్దేశించే నోరు పారేసుకున్నాడు. బాబా
భాస్కర్ గురించి మహేషే.. వరుణ్, వితికా,
రాహుల్ దగ్గర చులకన చేసి మాట్లాడుతూ అక్కడ పుల్లపెట్టాడు.
ఆయన ఎప్పుడూ నిజం చెప్పడు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. మళ్లీ కాసేపటికి బాబా, శ్రీముఖి, అలీ, శివజ్యోతి దగ్గరకు వచ్చి మీ గురించి వాళ్లు ఇలా అనుకుంటున్నారు తెలుసా? అని ఇక్కడో పుల్ల వేశాడు. నేను పుల్లలు పెట్టడం లేదు అంటూనే.. వాళ్ల మధ్య జరిగిన డిస్కషన్ని తనకి ఫేవర్గా మార్చుకుని చెప్పాడు.అయితే
మహేష్ తమ రెండు గ్రూపుల మధ్య పుల్లలు పెడుతున్నాడని.. ఇక్కడ విషయం అక్కడ, అక్కడ విషయం ఇక్కడ ఎలా చెప్తాడో చూడండి అంటూ రాహుల్, శ్రీముఖిలు మనోడి క్యారెక్టర్ని బయట పెట్టారు.
వాళ్లు ఎలాగైతే చెప్పారో
మహేష్ కూడా ఇరువురి మధ్య పుల్లలు పెడుతూ బిగ్ బాస్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు.ఇక
మహేష్ ఆటతీరుతో విసిగిన ప్రేక్షకులు ఇక పుల్లలు పెట్టింది చాల్లే నారద మహేష్.. ఇక బ్యాగ్ సర్ధు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈవారంలో నామినేషన్స్లో మహేష్, రాహుల్, వరుణ్లు ఉండటంతో ఈ ముగ్గురిలో మూడింది మహేష్కే అని బిగ్ బాస్ ఫాలోవర్స్ అభిప్రాయ పడుతున్నారు.