చివరి గట్టాలకు వచ్చిన తర్వాతనే అసలు ఆట ప్రారంభమవుతుంది ఈ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ లో అలా ఇప్పుడు బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకొన్న సమయంలో మరో ఎలిమినేషన్ జరిగింది. పన్నెండో వారానికి గానూ వరుణ్, మహేష్ నామినేషన్ అయిన సంగతి తెలిసిందే. ట్రాలీ టాస్క్‌లో భాగంగా సరైన చోట పార్కింగ్ చేయలేక నలుగురు నామినేట్ కాగా మెడాలియన్ ఉండటం వల్ల వితికా ఎలిమినేషన్‌లోంచి బయటపడగా. మహేష్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.అయితే మహేష్ ఇంటి నుంచి వెళ్తుంటే కనీసం ఎవరూ కూడా పెద్దగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. సండే ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
తనను టార్గెట్ చేస్తున్నారని ఎమోషనల్ అయిన బాబా...

అన్ని టాస్క్‌ల్లో తననే టార్గెట్ చేస్తున్నారని, ఊసరవెళ్లి, జోకర్ అని తనకే ఇస్తున్నారని, తాను అంతగా సీరియస్‌గా తీసుకోనని అందుకోసమే తనకు అలా ఇస్తున్నారంటూ బాబా తెగ ఫీలయ్యారు. ఇదే విషయాన్ని నాగ్ వద్ద ప్రస్థావించి తాను కేవలం టాస్క్‌లు ఆడటానికే వచ్చానని, స్ట్రాటజీలు తెలీవని, టైటిల్ గెలవాలని తనకు లేదంటూ కంటతడిపెట్టాడు.
హౌస్‌మేట్స్ చేత నాగార్జున ఓ ఆట ఆడించాడు.ఇంటి సభ్యులను రెండు టీమ్ మేట్స్‌గా విడగొట్టిన నాగార్జున వారితో మంచి ఎంటర్టైన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఒక టీమ్‌లోని మెంబర్ వారికిచ్చిన మూవీ టైటిల్‌కి సంబంధించి.. బొమ్మను గీసి గుర్తుపట్టేలా చేయాలని తెలిపాడు.ఈ టాస్క్‌లో శ్రీముఖి టీమ్ చురుకుగా వ్యవహరించి టీమ్ మేట్స్ గీసిన బొమ్మలను గుర్తించింది.
బొమ్మలను గీయడంలో వెనుకబడిన మహేష్ టీమ్..ఎఫ్2, బలుపు, సరైనోడులాంటి సినిమా పేర్లను ఇంటి సభ్యులకు నాగార్జున ఇవ్వగా.వారంతా చాలా కష్టపడి గీసారు.

దీంట్లో వితికాకు ఎఫ్2 చిత్రం రాగా ఆమె గీసిన చిత్రాన్ని వారు గుర్తించలేకపోయారు.ఇలా మహేష్ పై ఒక్కో అపజయం పడి మొత్తానికి ఎలిమినేషన్ పరిస్థితి దాకా వచ్చింది.చూద్దాం టైటిల్ విన్నర్ ని ప్రకటించే లోపు ఎన్ని ఘోరాలను చూడాల్సి వస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: