భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయేలా ఓ బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఒక్క సారిగా  ప్రస్తుత పోటీ దారైన జియో కి భారీ షాక్ ఇచ్చింది. తన కస్టమర్లు ఊహించని స్థాయిలో ఎయిర్టెల్ ఈ రేంజ్ లో ఇలాంటి ఆఫర్ ని ప్రకటించడం ఇదే మొదటి సారి అంటున్నారు నిపుణులు. ఈ ఆఫర్ లో భాగంగా ఎయిర్టెల్ తన కస్టమర్లు గనుకా రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే..

 Image result for airtel 249 plan

వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక మెసేజ్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ నార్మ్స్ ఎలా ఇవ్వాలి అనే వివరాలు ఉంటాయట. వాటిని నమోదు చేస్తే వారి ఫోన్ లో ఉన్న ఎయిర్టెల్ యాప్ నుంచీ పాలసీ కాపీని పొందవచ్చు అని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భారతీ ఆక్సా నుంచి ఆ పాలసీ ఇవ్వబడుతుందని

 Image result for airtel 249

ఇదిలాఉంటే ఈ ప్లాన్ తీసుకున్న కస్టమర్లకి రోజుకు 2 జీబీ డేటా,100 ఎస్ఎంఎస్‌లు, అన్‌ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ టీవీ ప్రిమియం సేవలు జీ5, హుక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌, లైవ్ ఛానల్స్ , సినిమాలు, ఒక సంవత్సర కాల వ్యవధి గల  నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి.కానీ దీని వ్యాలిడిటీ మాత్రం 28 రోజులు మాత్రమే...


మరింత సమాచారం తెలుసుకోండి: