ప్రస్తుతం బీటా దశలోఉన్న ఈ సేవలు అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే గిగా ఫైబర్‌ ధర భారీగా తగ్గినట్టు మీడియాలో పలు అంచనాలు వెలువడుతున్నాయి.  గతానికంటే రూ.2వేలు తక్కువగా అంటే రూ.2,500కే కనెక్షన్‌ అందిస్తున్నట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు తాజాగా అందిస్తున్న గిగా ఫైబర్‌లో కనెక్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

దీని ప్రకారం ఇంకా వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించనప్పటికీ గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.  అలాగే, ఈ సేవల్ని పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించే మొత్తాన్ని కూడా జియో తగ్గించినట్లుగా  తెలుస్తోంది.  జియో  గిగా ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలకుగాను సెక్యూరిటీ డిపాజిట్ రూ.4,500గా ఉంది.  ప్రస్తుతం దీన్ని  రూ.2 వేలు తగ్గింపుతో  రూ.2,500కే  గిగా ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తేనుంది.  అయితే  వేగాన్ని 50ఎంబీపీఎస్‌  తగ్గించినట్టు సమాచారం.

పాత ప్లాన్‌ప్రకారం రూ.4,500 కనెక్షన్‌తో డ్యుయల్ బ్యాండ్ రోటర్ అందిస్తుండగా , తాజా ప్లాన్‌లో రూ.2,500 కనెక్షన్ ప్లాన్‌తో సింగిల్  బ్యాండ్‌ వైఫై రోటర్‌ను అందివ్వనుంది.   అలాగే మొదటి ప్లాన్‌తో పోలిస్తే రెండో  ప్లాన్‌లో వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి ప్లాన్ వేగం 50ఎంబీపీఎస్ ఉంటే, రెండో ప్లాన్ వేగం 100 ఎంబీపీఎస్ ఉండనుంది. అంటే సగం తగ్గనుందన్నమాట.

దీంతోపాటు  యూజర్లకు నెలకు 100 జీడీ డేటా, వాయిస్‌ కాల్స్‌ ఉచితం. అంతేకాదు జియో టీవీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ప్లాన్ యూజర్లకు మాత్రం వాయిస్ కాల్ సర్వీసు అందుబాటులో లేవు. అయితే తాజా ప్లాన్‌పై  జియో సంస్థ ఎలాంటి అధికారిక ధృవీకరణ చేయలేదు


మరింత సమాచారం తెలుసుకోండి: