బ్యాంకుల సౌకర్యాలను సులభవంతం చేసే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ లేదా ఎటిఎం ఆల్ టైమ్ మనీ మెషీన్గా ఉండకపోవచ్చు. బ్యాంక్ వినియోగదారులకు ఇదో చేదు వార్తనే చెప్పాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం, పెరుగుతున్న ఎటిఎం మోసాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఎటిఎం లావాదేవీలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం 6 నుంచి 12 గంటల వ్యవధి ఉండేలా ఒక లావాదేవీని అనుమతించాలని బ్యాంకులు కోరుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది.
వాస్తవానికి ఇప్పటికే ఎటిఎం మోసాలను తగ్గించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎం నగదు ఉపసంహరణ పరిమితిని రూ .20,000 కు తగ్గించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ స్టేట్-లెవల్ బ్యాంకర్స్ కమిటీ ఎటిఎం మోసాలను నివారించడానికి అనేక చర్యలను సూచిస్తోంది. ఇంకా, బ్యాంకులు ఏటీఎంలలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ ఫీచర్తో ఏటీఎంలకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థను ఉంటుంది.
దీంతో ఎవరైనా హెల్మెట్తో ఏటిఎమ్లోకి వెళితే, మరొక వైపు ఉన్న వాయిస్ దానిని తీయమని సలహా ఇస్తుంది. అదేవిధంగా, బ్యాంక్ శాఖలలో కూడా, వినియోగదారులు టెల్లర్కు దూరంగా ఉండమని సలహాను సూచిస్తుంది. దేశవ్యాప్తంగా, మోసాల సంఖ్య 2018 తో పోలిస్తే ఈ సంవత్సరం 911 నుంచి 980 వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే 233 ఏటీఎం మోసం కేసులతో మహారాష్ట్రలో మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ 179 కేసులతో రెండో స్టానంలో ఉంది. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు బ్యాంకులు మరో ముందడుగు వేస్తున్నాయి.