అతి తక్కువ ధరతో అందరికి అందుబాటులో ఉండే ఫోన్ ఏది అంటే షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్‌మి అని చెప్పచ్చు. ఈ రెడ్‌మి ఫోన్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ లంచ్ అయ్యింది. రెడ్‌మి 8 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. డ్యుయల్ కెమెరా సెంట్రిక్ డివైజ్ తో పాటు 4,000mAh భారీ బ్యాటరీ కేపాసిటీ ఎంతో ఆకర్షణీయంగా ఈ స్మార్ట్ ఫోన్ ఉంది. 2GB RAM + 32GB స్టోరేజ్ తో ఈ ఫోన్ వచ్చింది. 


ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.6వేల 499గా కంపెనీ నిర్ణయించింది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, "ఇండస్ట్రీ-లీడింగ్" ఎడ్జ్ డిటెక్షన్, సోనీ ఐఎంఎక్స్‌ 363  సెన్సర్‌, స్కిన్ టోన్ మ్యాపింగ్ వంటి లక్షణాలకు మద్దతునిస్తుంది. అలాగే  స్పీడ్‌ చార్జింగ్‌ కోసం యూఎస్‌బీ టైప్‌ సీ చార్జర్‌ , కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, వాటర్‌డ్రాప్ తరహా నాచ్‌ డిజైన్‌ పెద్ద డిస్‌ప్లే , ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చింది. "అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్"తో  రెడ్ , బ్లూ, బ్లాక్‌ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ ను ఆవిష్కరించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఎంఐ.కామ్‌, ఎంఐ సోర్స్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అక్టోబర్‌ 12నుంచి కస‍్టమర్లకు అందుబాటులోకి రానుంది. 


రెడ్‌మి 8 ఫీచర్లు ఇవే :


డ్యుయల్ కెమెరా సెటప్ 


4,000mAh పెద్ద బ్యాటరీ 


2GB RAM + 32GB స్టోరేజీ


8 ARM Cortex-A53 కోర్


స్నాప్ డ్రాగన్ 439 SoC


ఫోన్ డిస్ ప్లే HD+ (720x1520 ఫిక్సల్)


అడ్రినో 505 GPU


320ppi డెన్సిటీ 


డాట్ నాచ్ డిస్ ప్లే


పాలీకార్బొనేట్ గ్లాస్ 


ఫింగర్ ఫ్రింట్ స్కానర్ (బ్యాక్)


ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్ 


షియోమీ కస్టమ్ MIUI10 స్కిన్


48 MP ప్రైమరీ కెమెరా ( Pro) 


బెజిల్ లెస్ డిస్ ప్లే


మరింత సమాచారం తెలుసుకోండి: