ప్రస్తుత పండుగని దృష్టిలో పెట్టుకున్న ఈ కామర్స్ దిగ్గజాలు, ఆఫర్స్ మీద ఆఫర్స్ ని ప్రకటిస్తున్నాయి. కళ్ళు  ప్రతీ ఒక్క కష్టమర్ తన ఆన్లైన్ స్టోర్ లోకి వచ్చి ఎదో ఒక వస్తువుకోనేలా పండగ ఆఫర్ల పబ్లిసిటీ తో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఫ్లిప్కర్ట్ దీపావళి సందర్భంగా redmi నోట్ 7 ప్రో మొబైల్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. దీపావళి సేల్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ. 11,9999 ధరకి విక్రయిస్తున్నట్టుగా ప్రకటించింది.

 

Redmi నోట్ 7 ప్రో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వేరియంట్ ధరని  కేవలం  రూ. 11,999 ధరకు విక్రయించడనుండటంతో ఎప్పుడెప్పుడు ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుందో అంటూ వేచి చూస్తున్నారు. అలాగే ఈ మొబైల్ ఫ్లిప్కర్ట్ నుంచీ కొనుగోలు చేసేవారికి, అలాగే పాత ఫోన్ మార్చి తీసుకునే వారికి దాదాపు రూ. 11.200 వరకూ భారీ తగ్గింపు దక్కనుంది.

 

ఇదిలాఉంటే redmi నోట్ 7 ప్రో ని ఫిబ్రవరి 2019 లో భారత మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అప్పట్లోనే అత్యధిక మొబైల్స్ అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్ గా ఈ redmi నోట్ 7 ప్రో రికార్డ్ క్రియేట్ చేసింది. తాజగా ఇదే ఫోన్ పై 2000 భారీ తగ్గింపు ప్రకటన చేయడంతో  ఈ ఫోన్ కొనుగోలుపై భారీ అంచనాలు ఉన్నాయి అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: