ప్రముఖ
స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇప్పుడు మరో కొత్త మొబైల్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. మొబైల్తయారీదారు మోటరోలా జి సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను శుక్రవారం నాడు లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో జీ8 ప్లస్ను తీసుకొచ్చింది.
అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ పింక్ రంగుల్లో, అక్టోబర్ 29 నుండి ఫ్లిప్కార్ట్ ద్వారా లభ్యం కానుంది. దీనికి తోడు జియో ఆఫర్ కూడా ఇస్తున్నారు. వినియోగదారులకు 2200 తక్షణ క్యాష్బ్యాక్ సదుపాయంతో పాటు రూ. 3వేల క్లియర్ ట్రిప్ కూపన్, రూ. 2వేల జూమ్ కార్ వోచర్ లభించనున్నాయి.దీని ధర రూ.13,999.
మోటొరోలా నుంచి వచ్చే మొబైళ్లలో ఇప్పటికే జి సిరీస్ బాగా ప్రాచుర్యం పొందింది.బడ్జెట్ ధర కూడా అందరికి అందుబాటులో ఉండటం వీళ్ల ప్రతేకత. మోటో జీ 8 ప్లస్ ఫీచర్లు విషయానికి వస్తే,6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 9పై క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీమ స్టోరేజ్ 512 వరకు విస్తరించుకునే అవకాశం 25
ఎంపీ సెల్ఫీ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా 48+16
ఎంపీ అల్ట్రా వైడ్, 5
ఎంపీ డెప్త్ సెన్సర్ 4000 ఎంఏహెచ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్, డాల్బీ స్టీరియో స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, టైప్ సీ ఛార్జర్ ఈ
ఫోన్ యొక్క ఇతర ప్రత్యేకతలు.
మరి అందుబాటు ధరలో తీసుకురానున్న ఈ మొబైల్ ఏ మేర యూజర్లను ఆకట్టుకుంటుదో చూడాలి. దీంతోపాటు మోటో జీ8 ప్లే, మోటో ఈ6 ప్లే మోడల్స్ కూడా మోటో ఆవిష్కరించారు. అవి మన దేశానికి ఎప్పుడొస్తాయనేది మనకు త్వరలో తెలుస్తుంది.