ప్రముఖ దిగ్గజ సంస్ద మోటరోలా జి సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కాస్మిక్‌ బ్లూ, క్రిస్టల్‌ పింక్‌ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే ఈ జీ8 ప్లస్‌ ఫోన్ ప్రత్యేకంగా అక్టోబర్‌ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్ మధ్య తరగతి వారికీ బడ్జెట్ ధరలో ఈ జీ8 ప్లస్‌ ఫోన్ అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరకే ఈ జీ8 ప్లస్‌ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ జీ8 ప్లస్‌ ఫోన్ వినియోగదారులకు 2200 తక్షణ క్యాష్‌బ్యాక్‌ పొందే సదుపాయంతో పాటు రూ. 3వేల క్లియర్‌ ట్రిప్‌ కూపన్‌, రూ. 2వేల జూమ్‌ కార్‌ వోచర్‌ లభించే అవకాశం ఉంది. 


మోటో జీ 8 ప్లస్‌ ఫీచర్లు ఇవే... 


6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ ప్లే,


ఆండ్రాయిడ్‌ 9పై,


క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌,


4 జీబీ ర్యామ్‌, 


64 జీబీమ స్టోరేజ్‌,


512 వరకు విస్తరించుకునే అవకాశం,


25 ఎంపీ సెల్ఫీ కెమెరా,


ట్రిపుల్‌ రియర్‌ కెమెరా 48+16 ఎంపీ అల్ట్రా వైడ్‌, 


5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌,


4000 ఎంఏహెచ్‌,


వాటర్‌  రిపెల్లెంట్‌ డిజైన్‌, 


డాల్బీ స్టీరియో స్పీకర్స్‌, 


ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌,


టైప్‌ సీ ఛార్జర్‌ ఇతర ప్రత్యేకతలు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.13,999 మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: