ఇప్పటికే మొబైల్ పిచ్చిలో పడి చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
టీవీ సీరియల్ గోల లో పడి కూరలు మాడ్చేసే ఆడవాళ్ళూ ఉన్నారు. కాని
టీవీ రందిలో పడి సొంత బిడ్డనే పోగొట్టుకున్నారు ఓ దంపతులు.తమిళనాడు త్రెస్పురం గ్రామంలో ఈ ఘోరం జరిగింది.సుజిత్ విల్సన్....! కొద్దిరోజులుగా జాతీయస్థాయిలో వినిపిస్తున్న పేరు.బోరుబావిలో పడిపోయిన
సుజిత్ విల్సన్ గురించి
టీవీ లో ఒకటే ఎక్సక్లూసివ్ షో లు ఇస్తున్నారు ఛానల్ వాళ్ళు.
బాబు పరిస్థితి గురించి ప్రతి క్షణం ఛానల్ లో ఊదరగొడుతున్నారు. అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయలేకపోయారు. చివరికి
సుజిత్ విల్సన్ చనిపోయినట్టు ఈ రోజు నిర్దారించారు.ఆ బాబు గురించి మరొక తల్లిదండ్రులు
టీవీ చూస్తూ పాపను గమనించకపోవడం వల్ల తమ మూడేళ్ల చిన్నారి పాప నీటితొట్టిలో పడి చనిపోయింది.చిన్నారి నీటితొట్టిలో పడిపోయిన సమయంలో వారు బోరుబావిలో పడిపోయిన
సుజిత్ విల్సన్ వార్తలు చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బోరు బావిలో పడిపోయిన ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని యావద్దేశం ప్రార్థించింది. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబమూ కూడా విల్సన్ ప్రాణాలతో రావాలని ఆశగా ఎదురు చూసారు.సుజిత్ బయటకు వస్తే చూడాలన్న ఆశతో టీవీకే అతుక్కుపోయింది ఆ కుటుంబం.కానీ అదే... ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది.వారి రెండేళ్ల పాప నీటితొట్టిలో పడి పోయిన సంగతి కూడా వాళ్ళు గమనించలేకపోయారు.
తమిళనాడు త్రెస్పురం గ్రామంలో మూడేళ్ల పసిపాప
రేవతి సంజన నిన్న రాత్రి ఆడుకుంటూ
నీటి తొట్టిలో పడి చనిపోయింది.తరువాత కొద్దిసేపటికి పాప గురించి వెతికిన వారికి
నీటి తొట్టిలో చలనం లేకుండా ఉన్న చిన్నారి కనిపించింది. హుఠాహుఠిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.