టెలికాం రంగంలో 2జీ, 3జీ, 4జీ అంటూ... దినదిన ప్రవర్థమానంగా
టెక్నాలజీ ఎదుగుతోంది. 5జీ కూడా త్వరలో వస్తోందని గతకొంత కాలంగా వినిపిస్తున్నమాట.అయితే పొరుగున ఉన్న డ్రాగన్ దేశం చైనా దీనిని నిజం చేసి చూపించింది. ఆ దేశ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన చైనా మొబైల్, చైనా యూనికాం, చైనా టెలికాం సంయుక్తంగా 5జీ డేటా ప్రణాళికలను విడుదల చేశాయి.
వచ్చే ఏడాది నాటికి 10కోట్ల 70లక్షల మంది చందాదారుల్ని చేర్చుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అగ్రరాజ్యం
అమెరికా సహా పాశ్చాత్య దేశాలను అధిగమించాలని చైనా మరో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటె చైనా కంటే ముందు దక్షిణ
కొరియా,
అమెరికా, బ్రిటన్ తమ దేశాల్లో ఈ ఏడాది 5జీ నెట్వర్క్ ప్రారంభించాయి. ఆ దిశగా డ్రాగన్ తొలి అడుగు వేసింది. బీజింగ్, షాంఘై సహా దాదాపు 50 నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నాయి.
పంచ వ్యాప్తంగా 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో చైనాకు చెందిన హువావే కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది. చైనాలో 5జీ సేవలు ప్రారంభించే నెట్వర్క్కు సంబంధించిన ఎక్కువ పరికరాలను హువావే కంపెనీ సరఫరా చేసింది. 128యువాన్ల నుంచి 599 యువాన్ల వరకు నెలవారీ ధరలు నిర్ణయించాయి. ఇప్పటికే షాంఘైలో 5జీకి సంబంధించిన 11,859 బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అధికారికంగా విడుదల చేయడానికి ముందే 10మిలియన్ల మంది 5జీ సేవలకు రిజిస్టర్ చేసుకున్నట్లు ఓ
సర్వే వెల్లడించింది. 4జీ కంటే 5జీ సేవలు పది నుంచి 100రెట్లు వేగంగా పనిచేస్తాయి. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే డ్రైవర్లెస్ కార్,ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ వంటి అత్యాధునిక
టెక్నాలజీ ప్రజలకు చేరవకానుంది. ఇదిలావుండగా త్వరలో 5జీ టెక్నాలజీని భారత్లోనూ ప్రవేశపెట్టాలని చైనా భావిస్తోంది.