టిక్ టాక్ ప్రస్తుతం ఇది తెలియని వారు ఉండరు. ఒక్కసారి అడిక్ట్ అయ్యారు అంటే చేస్తే సెలబ్రెటీ చెయ్యాలి లేదా చంపేయాలి అన్నట్టు ఉంటుంది ఈ టిక్ టాక్. ఈ టిక్ టాక్ వల్ల కొన్ని వేల మంది చచ్చిపోయారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ టిక్ టాక్ కి కొన్ని కోట్లమంది అభిమానులు అయ్యారు. 


అందుకే ఇన్నాళ్లు ఒక యాప్ లా ఉన్న ఈ టిక్ టాక్ ఇప్పుడు మరింత దగ్గర అయ్యేందుకు ప్లాన్ చేసింది. అందుకే టిక్ టాక్ నుంచి ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది ఈ సంస్ద. టిక్‌టాక్ క్రియేటర్ బైట్ డ్యాన్స్ కంపెనీ స్మార్టిజన్ జియాంగో ప్రొ3 పేరుతో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో విడుదల కానుంది. అయితే ఈ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. 


టిక్‌టాక్ స్మార్ట్‌ఫోన్‌ అదిరిపోయే ప్రత్యేకతలు.. 


6.39 ఇంచుల డిస్‌ప్లే, 


ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్,


8జీబీ, 12 జీబీ ర్యామ్,


128/256 జీబీ స్టోరేజ్,


డ్యూయల్ సిమ్,


48,13, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు,


20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,


ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,


డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,

బ్లూటూత్ 5.0,


యూఎస్‌బీ టైప్ సి,


బ్యాటరీ కెపాసిటీ 4000 Mhz


అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ ధరలు భారీగా ఉన్నాయి. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,000. 8 జీబీ ర్యామ్+256 జీబీ వెర్షన్ ధర రూ.32,000 ఉంది. హై-ఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్+256 జీబీ వేరియంట్ ధర రూ.36,000 ఉంది. ఫోన్ అదిరిపోయిన ధరలు మాత్రం పేలిపోతున్నాయి. మరి ఈ టిక్ టాక్ స్మార్ట్ ఫోన్ ఎంత బాగుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: