వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెగసస్ స్పైవేర్ కారణంగా తీవ్ర సమన్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ద్వారా వాట్సాప్ యూజర్ల కార్యకలాపాలను హ్యాకర్లు తెలుసుకోగలుగుతున్నారు. ఈ టైం లో ఒక కొత్త అప్డేట్ తో మన ముందుకొచ్చింది వాట్సాప్.ఇన్నాళ్లు ఎవరి దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉన్నా.. వారు మిమ్మల్ని ఏదైనా వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేర్చొచ్చు. కొన్ని సార్లు గుర్తు తెలియని వ్యక్తులూ.. గ్రూపుల్లో చేర్చడం వీలవుతుంది. అయితే కొత్త ఫీచర్తో ఈ సమస్యకు చెక్పడనుంది.


గ్రూప్ ప్రైవసీకి కోసం సరికొత్త అప్డేట్ తీసుకువచ్చింది వాట్సాప్. అవసరంలేని, గుర్తుతెలియని గ్రూపుల్లో మిమ్మల్ని చేర్చకుండా కట్టడి చేసే ఫీచర్ను కొత్త అప్డేట్లో పొందుపరిచింది.   వాట్సాప్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్ను వినియోగించుకోవచ్చు.  
సంక్షిప్త సందేశాల దిగ్గజం.. వాట్సాప్ గ్రూప్ ప్రైవసీకి సంబంధించి కొత్త అప్డేట్ను అందుబాటులోకి తెచ్చింది. తెలియని వ్యక్తులు గ్రూపుల్లో చేర్చే వీలు లేకుండా ఈ అప్డేట్ను తీసుకువచ్చినట్లు వాట్సాప్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు వాట్సాప్ను అప్డేట్ చేసుకుని ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.


తాజా అప్డేట్తో గ్రూపులో మిమ్మల్ని ఎవరు చేర్చాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. అదెలా అంటే కొత్త అప్డేట్ ప్రైవసీ సెట్టింగుల్లో గ్రూపు అడ్మిన్పై క్లిక్ చేసి.. అందులో ఎవిరీవన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎవిరీవన్ను ఎంపిక చేసుకుంటే.. ఎవరైనా మిమ్మల్ని గ్రూపులో చేర్చేందుకు వీలుంటుంది.మై కాంటాక్ట్స్ ఎంపిక చేసుకుంటే.. మీ ఫోన్బుక్లో నంబర్ సేవ్ చేసుకున్న వ్యక్తులు తప్ప ఇతరులెవ్వరూ మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చడం వీలుకాదు.మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్తో.. మీరు నంబర్ సేవ్ చేసుకున్న వారిలోనూ.. ఎవరు మిమ్మల్ని గ్రూపులో చేర్చాలి.. ఎవరు చేర్చకూడదు అనేది నిర్ణయించొచ్చు.



ఇలా గ్రూపుల్లో మిమ్మల్ని సభ్యులుగా చేర్చడం వీలుకాని అడ్మిన్లకూ.. ఓ సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. ఎవరైతే అడ్మిన్ మిమ్మల్ని గ్రూప్లో చేర్చలనుకుంటారో.. వారు గ్రూప్లోకి చేర్చే అభ్యర్థన లింక్ను మీకు వ్యక్తిగతంగా పంపించవచ్చు. ఆ లింక్ ద్వారా మీరు గ్రూపులోకి చేరాలా, వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: