గత ప్రభుత్వంలో అసలు అభివృద్ధికి నోచుకోని పర్యాటక రంగం ఈ ఏడాది అధికార ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలున్నా జిల్లా పర్యాటక రంగంపై దృష్టి సారించింది వైఎస్సార్‌ సీపీ. అసలు పట్టించుకోని పర్యాటక విభాగాన్ని పట్టించుకుని తొలి విడతగా 3ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. విడతల వారీగా జిల్లాలోని అన్ని చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను గుర్తించి అభివృద్ధి చేసి జిల్లాను టూరిస్ట్‌ హబ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. 


వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తొలి విడతగా 2019–20 వార్షిక సంవత్సరానికి గాను 3ప్రాంతాలను పర్యాటక అభివృద్ధి కోసం ఎంపిక చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రాంతం, అన్నంగి, కొత్తపట్నం సముద్ర తీరాన్ని ఎంచుకుని అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే శాఖ అధికారులను సర్వే చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ పోల భాస్కర్‌ ఆదేశించారు. ఎంచుకున్న ఈ మూడు  ప్రాంతాలను ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కన్సల్టెంట్స్‌తో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. 


తొలి విడతగా ఎంచుకున్న ప్రాంతాలలో గుండ్లకమ్మ ప్రాజెక్టు ఒకటి ఇప్పటికే ఇక్కడ బోటు షికారు ఉన్నప్పటికీ దీన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని సర్కార్ ఆలోచన. తద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నారు. ఇక గుండ్లకమ్మలో బోటు షికారు కోసం బోట్‌ల సంఖ్య కూడా పెంచనున్నారు.రెండోది అన్నంగి ఈ ప్రాంతంలో 13 ఎకరాలలో ప్రత్యేకంగా పర్యాటక శాఖ సహకారంతో అభివృద్ధి చేయాలని, అన్నంగి కొండ మీద ఒంగోలు గిత్త పెద్ద ప్రతిమను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విశిష్టతను పర్యాటకులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. 


ఇక మూడో పర్యాటక రంగ ప్రాతం కొత్తపట్నం బీచ్‌.. దీన్ని అభివృద్ధి చేసి సందర్శకులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి తీర ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగేట్టు తీర్చిదిద్దనున్నారు. కలెక్టర్‌ సూచనలను అనుసరించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా తొలి విడతగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి సందర్శకుల సంఖ్య పెంచటం లక్ష్యంగా తద్వారా పర్యాటక ప్రాంతంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: