భారతదేశ  అతి పెద్ద బ్యాంక్  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఝలకిచ్చింది. ఎస్‌బీఐ మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచించింది. డిసెంబర్ 31 లోపు  డెబిట్ కార్డులను మార్చుకోవాలని పేర్కొంది. మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని తెలిపింది. 
 
‘రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం.. మేం ఇప్పటికే మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ అండ్ పిన్ ఆధారిత కార్డులతో రీప్లేస్ చేశాం. మాగ్నటిక్ స్ట్రిప్ కార్డులతో ఇంకా మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఈ కార్డులను డిసెంబర్ 31 తర్వాత డీయాక్టివేట్ చేస్తాం. పనిచేయవు. ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోండి’ అని ఎస్‌బీఐ కస్టమర్లకు తెలిపింది.

మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి ఇప్పుడే అప్లై చేసుకోవాలంటూ ఎస్‌బీఐ ట్వీట్ కూడా చేసింది. కొత్త ఈఎంవీ చిప్ అండ్ పిన్ ఆధారిత ఎస్‌బీఐ డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. దీంతో మోసాల బారిన పడకుండా రక్షించుకోవచ్చని తెలిపింది.స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగానే పాత మ్యాగ్నటిక్ డెబిట్ కార్డుల స్థానం లో కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డును పొందొచ్చు. కస్టమర్లు ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే కొత్త డెబిట్ కార్డును సులభంగా పొందొచ్చు. ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో యాప్ లేదంటే , బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి పని పూర్తిచేసుకోవచ్చని వివరించింది.

కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఎస్‌బీఐ కస్టమర్లు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కరెంట్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలి. కొత్త ఈఎంవీ చిప్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్న అడ్రస్‌కే వెళ్లిపోతుంది. అందువల్ల అడ్రస్ మారి ఉంటే అప్‌డేట్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: