ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రియల్మీ దూకుడు కొనసాగిస్తోంది. వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ యూజర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇక తాజాగా మొబైల్ తయారీదారు రియల్మి తన నూతన స్మార్ట్ఫోన్ రియల్మి 5ఐని జనవరి 9 విడుదల చేసింది. నాలుగు కెమెరాలు, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటి మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్ ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్మీ 5 సిరీస్లో ఇప్పటికే రియల్మీ 5 ప్రో, రియల్మీ 5, రియల్మీ 5ఎస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మళ్లీ ఇప్పుడు తక్కువ ధరలో రియల్మీ 5ఐ రిలీజ్ చేసింది. షావోమీకి చెందిన రెడ్మీ 8 మోడల్ను టార్గెట్ చేస్తూ రియల్మీ 5ఐ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.8,999 మాత్రమే. ఈ ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంఛైంది. ఇప్పుడు ఇండియాకు వచ్చింది. ఇండియాలో జనవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్తో పాటు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో సేల్ మొదలవుతుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 9.0 పై, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 12+8+2+ 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో విశేషం ఏంటంటే.. రిలయెన్స్ జియో యూజర్లకు రూ.7,550 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. దాంతో పాటు క్యాషిఫై, మొబీక్విక్ నుంచి ఆఫర్స్ ఉన్నాయి.