భారత్ గర్వించే ఇస్రో కీర్తి కిరీటంలో కలికితురాయి చేరింది. ఇస్రో మరోసారి అంతరిక్ష ప్రయోగాల్లో తనకు ఎదురులేదని చాటింది. అత్యంత శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జి-శాట్  30ని విజయవంతంగా ప్రయోగించింది.

 

ఏరియాన్ -5 వాహకనౌక 38నిమిషాల్లో జీ-శాట్  ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ట్విట్  చేశారు. ఇన్ శాట్ - 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్ -30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తూ ఏరియాన్  స్పేస్ సీఈఓ స్టెఫాన్ ఇస్రాల్ ట్వీట్ చేశారు. 

 

కొత్త ఏడాదికి బలమైన ప్రారంభం మొదలైంది. ఏరియాన్-5 రాకెట్  ద్వారా యుటెల్సాట్ కనెక్ట్, జీశాట్-30 జియోస్టేషనరీ ట్రాన్స్ ఫర్ ను కక్ష్యలో ప్రవేశపెట్టాం అని ట్విట్టర్లో  పేర్కొన్నారు. ఫ్రెంచ్  గయానా నుంచి ఈ ప్రయోగం జరిగింది. 

 

ఈ ప్రయోగంతో నాణ్యమైన టెలివిజన్  ప్రసారాలు, టెలికమ్యూనికేషన్ , బ్యాడ్ క్రాస్టింగ్  సేవలు మరింత మెరుగవుతాయి. దక్షిణ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న ఫ్రెంచ్  భూభాగంలోని కౌరులోని ఏరియాన్  లాంఛ్  కాంప్లెక్స్  నుంచి తెల్లవారుజామున 2. 35 నిమిషాలకు ఈ ప్రయోగం చేపట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: