గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసిందో, లేదో అమెజాన్ నుంచి మరో సేల్ వచ్చేసింది. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్ ప్రకటించినట్లు కంపెనీ పేర్కొంది. రిపబ్లిక్ డే సందర్భంగా 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్' ప్రారంభమైంది. జనవరి 18న ప్రైమ్ మెంబర్స్కి సేల్ మొదలవగా, జనవరి 19న అందరికీ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఎప్పట్లాగే స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్.
స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10% అదనంగా తగ్గింపు లభిస్తుంది. మరి ఆ అద్భుతమైన స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేసేయండి. రెడ్మీ నోట్ 8 ప్రో 6జీబీ+64జీబీ అసలు ధర రూ.14,999 కాగా, ఆఫర్ ధర రూ.13,999కు లభిస్తుంది. రెడ్మీ నోట్ 8 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఎక్స్ఛేంజ్పై రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,499 కాగా, రూ.7,999 ఆఫర్ ధర లభిస్తుంది.
అలాగే ఒప్పో ఎఫ్11 స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ అసలు ధర రూ.14,990 కాగా, ఆఫర్ ధర రూ.13,990 మాత్రమే అదిస్తున్నారు. షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ అసలు ధర రూ.12,499 కాగా, ఆఫర్ ధర రూ.11,999. ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం40 స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ అసలు ధర రూ.16,999 కాగా, ఆఫర్ ధర రూ.13,999కు మాత్రమే పొందొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా, ఆఫర్ ధర రూ.12,999 పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం సేల మొదలుపెట్టండి మరి..!