అతితక్కువ ధరకే స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇదే సరైన సమయం. ఎందుకంటే అతి చవక ధరకే అద్భుతమైన పీచర్లతో లావా నుంచి ఓ కొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. గత నెలలో జెడ్71 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన లావా తాజాగా లావా జెడ్53 పేరుతో మరో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆన్ లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరకే లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ లో ఫీచర్లు మాత్రం ధరతో పోల్చినప్పుడు అద్భుతంగా ఉన్నయి అనడంలో సందేహం లేదు.
ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే.. ఇందులో 6.1 అంగుళాల డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 19:9గా ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను ఇందులో అందించారు. వెనకవైపు 8 మెగా పిక్సెల్, ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 4,120 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. అయితే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించలేదు. కానీ సెక్యూరిటీ కోసం ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను అందించారు.
అలాగే డ్యూయల్ సిమ్, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం జాక్, యూఎస్ బీ 2.0 ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.4,829గా నిర్ణయించారు. మరో విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి జియో రీచార్జ్ వోచర్లు, 50 జీబీ అదనపు డేటా ద్వారా రూ.1,200 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను అందించనున్నారు. అయితే ఈ లాభాలు రూ.199, రూ.299 రీచార్జ్ ల మాత్రమే వర్తించనున్నాయి. ఇంకెందుకు అలస్యం త్వరగా కొనుగోలు చేయడం స్టాట్ చేయండి మరి.