2020లో తన మొదటి స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయడానికి రెడ్మీ రంగం సిద్ధం చేసుకుంటుంది. షావోమీ ఫ్యాన్స్కు రెడ్మీ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఫిబ్రవరి 11న రెడ్మీ 9ఏ రిలీజ్ చేయబోతున్నట్టు షావోమీ అధికారికంగా ప్రకటించింది. షియోమీ గతంలో రెడ్మీ 6ఎ, రెడ్మీ 7ఏ, రెడ్మీ 8ఏలను ప్రచారం చేయడానికి ‘దేశ్ కా స్మార్ట్ఫోన్’, ‘స్మార్ట్ దేశ్ కా ఫోన్’, ‘స్మార్ట్ దేశ్ కా దందార్ స్మార్ట్ఫోన్’ ట్యాగ్లైన్లను ఉపయోగించారు.
కాబట్టి ‘దేశ్ కా దందార్ స్మార్ట్ఫోన్’ అనే ఈ కొత్త ట్యాగ్లైన్ రెడ్మీ 9ఏ లాంచ్ను సూచిస్తుందని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాదు... రెడ్మీ నుంచి మరో పవర్ బ్యాంక్ కూడా రిలీజ్ కానుంది. గతేడాది రెడ్మీ 8ఏ స్మార్ట్ఫోన్ను తక్కువ ధరకే రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది షావోమీ. ఇప్పటికీ ఈ ఫోన్కు మంచి డిమాండే ఉంది. ఇప్పుడు రెడ్మీ 8ఏ అప్గ్రేడ్ వర్షన్ రెడ్మీ 9ఏ మోడల్ను రిలీజ్ చేయబోతోంది షావోమీ. ఈ ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలేవీ ఇంకా తెలియలేదు. కానీ... 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుందని షావోమీ క్లారిటీ ఇచ్చింది.
ఈ కొత్త రెడ్మీ స్మార్ట్ఫోన్ను ఫిబ్రవరి 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల కానుంది. కాగా, స్మార్ట్ఫోన్ మార్కెట్లో రియల్మీ, షావోమీ పోటాపోటీగా మోడల్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న రియల్మీ సీ3 స్మార్ట్ఫోన్ రిలీజైంది. వెంటనే షావోమీ కొత్త ఫోన్ను ప్రకటించింది. రెడ్మీ 9ఏ మోడల్తో రియల్మీ సీ3 స్మార్ట్ఫోన్కు పోటీ ఇవ్వనుంది షావోమీ.