అతి తక్కువ సమయంలోనే కస్టమర్ల మనసును దోచుకున్న చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్మీ.. ఇప్పుడు మరింత దగ్గరయ్యేందుకు భారీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షావోమీ... ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇండియాలో రెడ్మీ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను షావోమీ రిలీజ్ చేస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే కస్టమర్లకు బిగ్ షాక్కు ఇచ్చింది. 9సిరీస్ లాంచింగ్ ప్లేసులో రెడ్మీ 8ఏ డ్యూయల్ పేరుతో బడ్జెట్ ధరలో సరికొత్త మోడల్ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
గతంలో వచ్చిన 8ఏ మోడల్కు కొనసాగింపుగా 8ఏ డ్యూయల్ను తీసుకొచ్చింది షావోమీ. రెడ్మీ 8ఏ డ్యుయెల్' స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలు చూస్తే యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లాంటి విశేషాలున్నాయి. ఈ మోడల్లో రెండు వెరియంట్లు ఉన్నాయి. అందులో 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ కల్గిన ఫోన్ ధరను రూ.6,499 కాగా.. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ను రూ.6,999గా నిర్ణయించారు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. రెడ్మీ 8ఏ డ్యూయల్ 6.22 అంగుళాల హెచ్డీ+, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ కలిగి ఉన్నాయి. అలాగే 2జీబీ, 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలో ఏఐ సీన్ డిటెక్షన్, ఏఐ పోర్ట్రైట్ మోడ్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ సీ బ్లూ, స్కై వైట్, మిడ్నైట్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, Mi.com, ఎంఐ హోమ్ స్టోర్స్లో సేల్ మొదలవుతుంది.