తాజాగా చైనీస్ మొబైల్ సంస్థ షియోమీ... రెడ్మీ నోట్ 7 ప్రో ధర భారీగా తగ్గించింది. మొన్నీమధ్య రెడ్మీ నోట్ 8 ప్రో ధర ఒక వెయ్యి రూపాయల వరకు తగ్గించిన విషయం తెలిసిందే. రెడ్మీ నోట్ 7 ప్రో 6జీబీ ప్లస్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న బేస్ వేరియంట్ ధర 14,999 రూపాయల నుండి 13,999 రూపాయలకు తగ్గింది. కానీ గతంలో కరోనా వైరస్ వలన సప్లై చైన్ లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనివలన రెడ్మీ నోట్ 8 ధరని రూ.500 షియోమీ సంస్థ పెంచేసింది.

 

అయితే రెడ్మీ నోట్ 7 ప్రో గతంలో విడుదలయి కోట్ల సంఖ్యలో అమ్ముడుపోయింది. దీని ద్వారా నిన్నటివరకు రూ. 15,999 ఉండగా... ఈరోజు మాత్రం కేవలం 9,999 రూపాయలకే లభించనుంది. అంటే అక్షరాల ఆరు వేల రూపాయల తగ్గింపు ధరకి రెడ్మీ నోట్ 7 ప్రో లభించనుందన్న మాట. ఇది రెడ్మీ ఫోన్ ప్రియులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు.




స్పెసిఫికేషన్ విషయాలు తెలుసుకుంటే... రెడ్మీ నోట్ 7 ప్రో 6.3అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో లభించనుంది. ఫోన్ కి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ అమర్చగా ఫ్రంట్ సైడ్ 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. 48 మెగాపిక్సల్ కెమెరాని ఉపయోగించి 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు. 4000mAh బ్యాటరీ తో ప్యాక్ చేయబడిన రెడ్మీ రెడ్మీ నోట్ 7 ప్రో క్విక్ చార్జింగ్ కు సపోర్ట్ చేయనుంది. ఖ్వల్కమ్ స్నాప్ డ్రాగన్ 635 ప్రాసెసర్ ఇందులో ఇవ్వబడింది. ఈ ప్రాసెసర్ కొంచెం పాతదే అయినప్పటికీ... పర్ఫామెన్స్ పరంగా సమర్థవంతమైన చిప్ సెట్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ కి గొరిల్లా ప్రొటెక్ట్ గ్లాస్-5 అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ నెఫ్ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్, మూన్ లైట్ వైట్, నెబ్యులా రెడ్ కలర్ వేరియంట్లలో లభించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: