స్మార్టఫోన్ల వినియోగం పెరిగే కొద్ది వాట్సాప్ వినియోగం కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్లలో యూజర్లు వినియోగించుకుంటున్నారు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. అయితే తాజాగా వాట్పాప్ మరో సరికొత్త ఫీచర్తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్ను జోడిస్తోంది.
పాస్వర్డ్ ప్రొటెక్ట్ బ్యాక్ అప్స్ అనే ఫీచర్ పేరుతో న్యూ అప్డేట్ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. దీంతో ఇకపై వాట్సాప్ యూజర్లు పాస్వర్డ్ను ఉపయోగించడం ద్వారా తమ చాట్ బ్యాక్ అప్ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. బీటా యూజర్లకే నూతన ఫీచర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఒక ఫోన్ నుంచి మరో ఫోన్కు మారిన క్రమంలో వాట్సాప్ చాట్స్ను కలిగి ఉండటంలో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం తమ చాట్ బ్యాక్ అప్ను ఎన్క్రిప్టెడ్ ఫామ్లో సేవ్ చేసుకోగలుగుతున్నారు. ఇక ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్ను యూజర్లందరికీ వాట్సాప్ మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక యూజర్లు ఇప్పుడు తమ ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 ఫోన్లలో డార్క్ మోడ్ ఆప్షన్కు మళ్లగానే ఆటోమేటిక్గా డార్క్ మోడ్ థీమ్ ఆన్ అవుతుంది. గత కొంతకాలంగా వాట్సాప్ పరీక్షిస్తున్న ఈ ఫీచర్ ప్రస్తుతం యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.