ఇటీవ‌ల కాలంలో రెడ్‌మీ ఫోన్ల‌కు క్రేజ్ బాగానే పెరిగిపోతుంది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం షావోమీ.. రెడ్‌మీ నోట్ 9 సిరీస్‌లో మ‌రో  కొత్త స్మార్ట్‌ఫోన్ విడుద‌ల చేసింది. ఈ ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్, 5020ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మలేషియాలో విడుద‌ల చేసింది షోవోమీ. అయితే ఇండియాలో ఇప్పటికే రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు అదే సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ మలేషియాలో రిలీజైంది.  ఇక ఇండియాలో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 9 ప్రో ఫీచర్స్ లాగానే రెడ్‌మీ నోట్ 9ఎస్ స్పెసిఫికషన్స్ ఉన్నాయి. అలాగే  ఈ స్మార్ట్‌ఫోన్ సింగపూర్, థాయ్‌ల్యాండ్, మలేషియాలో ఏప్రిల్7 నుంచి సేల్ ప్రారంభం కానున్న‌ట్టు తెల‌స్తోంది. మ‌రియు ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌స్టెల్లార్ గ్రే, అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్ క‌ల‌ర్స్‌లో ల‌భ్య‌మ‌వ్వ‌నుంది. మ‌రి ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలియాల్సి ఉంది.

 

ఇక రెడ్‌మీ నోట్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే..
- 6.67 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
- 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 4జీబీ, 6జీబీ ర్యామ్‌
- 48+8+5+2 మెగాపిక్సెల్ఫ్రంట్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 


- 5020ఎంఏహెచ్ బ్యాటరీ
- స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- డ్యూయెల్ సిమ్ సిమ్ సపోర్ట్
- 4జీబీ+64జీబీ- రూ.13,800, 6జీబీ+128జీబీ- రూ.15,500

మరింత సమాచారం తెలుసుకోండి: