టెలికం రంగంలోకి పెను ఉప్పెన‌లా దూసుకొచ్చిన రిలయన్స్ జియో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  అన్నీ ఉచితమంటా టెలికాం రంగంలో అడుగుపెట్టిన అందరినీ షేక్ చేసిన ఆ సంస్థ.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రత్యర్థులకు సవాల్ విసురుతూనే ఉంటుంది. ఇక రిలయన్స్ జియో ఏది చేసినా సంచలనమే అని చెప్పుకోవాలి. జియో యూజ‌ర్లు కూడా భారీ స్థాయిలోనే పెరిగార‌ని చెప్పుకోవాలి. ఇక వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు జియో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్లాన్‌ను తీసుకొస్తూ దూసుకుపోతోంది.

 

ముఖ్యంగా ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ టైమ్‌లో జియో మ‌రిన్ని ఆఫ‌ర్ల‌తో ముందుకొస్తోంది. తాజాగా జియో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు 3 జీబీ డేటాతో మ‌రో స‌రికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త క్వార్టర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ పొందాలంటే రూ.999 ధ‌ర చ‌ల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ వేలిడిటీ 84 రోజులు. అంటే సుమారు మూడు నెలల పాటు ఈ ప్లాన్ వాడుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా జియో నుంచి జియోకు, ల్యాండ్‌లైన్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 

 

జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కి కాల్ చేయడానికి 3,000 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ ద్వారా మూడు నెలలకు 252 జీబీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు. అంటే 1 జీబీ డేటాకు ధర రూ.4 లోపే చెల్లిస్తే స‌రిపోతుంద‌న్న‌మాట‌. మ‌రోవిష‌యం ఏంటంటే.. రోజూ 3జీబీ డేటా లిమిట్ పూర్తైనా డేటా వాడుకోవచ్చు. కాకపోతే స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. కాగా, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌ను దృష్టిలోపెట్టుకొని క్వార్టర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ను రూ.999 ధరకు రూపొందించింది రిలయెన్స్ జియో. 

మరింత సమాచారం తెలుసుకోండి: