ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగ రంజాన్. రంజాన్ అంటే ఏడాదికొకసారి వచ్చే పండుగ మాత్రమే కాదు, కొన్ని వేల కుటుంబాల కడుపు నింపే ఉపాధి. ఈ సమయంలో ముస్లింలు నెల పాటూ ఉపవాస దీక్షలు చేస్తారు. ఖురాన్ పటిస్తారు. దానధర్మాలు చేస్తారు. సోదరభావాన్ని చాటిచెబుతారు. అయితే.. ఏటా రంజాన్, బక్రీద్ పండుగల ప్రార్థనలు ఈద్గాల దగ్గర జరిగేవి. ఈసారి కరోనా కారణంగా ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతన్నాయి. ఈ వైరస్ కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ లేని కరోనాను కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్డౌన్ విధించాయి.
దీంతో ఇళ్లల్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం మత పెద్దలు కోరారు. ఇదిలా ఉంటే.. రంజాన్ పండగ సందర్భంగా తమ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. అదే రూ.786 ప్రీపెయిడ్ ప్లాన్. వాస్తవానికి ఈ రూ.786 రీచార్జ్ ప్లాన్ ను ప్రతి సంవత్సరం ఈద్, రంజాన్ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తీసుకువస్తుంది. గతంలో కూడా బీఎస్ఎన్ఎల్ ఇటువంటి ప్లాన్లను లాంచ్ చేసింది. కాకపోతే వాటి లాభాలు వేరుగా ఉన్నాయి.
అయితే తాజాగా ప్రకటించిన ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రూ.786 టాక్ టైం, 30 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఒకవేళ మీరు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ వెబ్ సైట్, యాప్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ రీచార్జ్ సర్వీసుల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రమోషనల్ ప్లాన్ 30 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అంటే మీరు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాలనుకుంటే కేవలం 30 రోజుల లోపే రీచార్జ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్ సర్కిళ్లలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.