రంజాన్ స్పెషల్ కారణంగా బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ను విడుదల చేసింది. ప్రతి సంవత్సరంలాగే రంజాన్ నెలలో 786 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ని విడుదల చేసింది. అయితే ఈ ప్లాన్ కేవలం 30 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 786 రూపాయలకే పొందడంతోపాటు 30 gb హై స్పీడ్ డేటా ను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులుగా బిఎస్ఎన్ఎల్ నిర్ధారించింది. 

IHG


అయితే గతంలో కూడా బిఎస్ఎన్ఎల్ ప్లాన్ కస్టమర్ల ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇక అలాగే వాటి లాభాలు మాత్రం వేరుగా ఉన్నాయి. అయితే ఈ కొత్త బిఎస్ఎన్ఎల్ ప్లాన్ కేవలం కేరళ, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ సర్కిల్స్ లో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ని మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ వెబ్ సైట్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ రీఛార్జ్ సర్వీసుల ద్వారా ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు..

IHG


అయితే ఈ ప్లాన్ కేవలం 30 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. దీనితో పాటు 190 రూపాయల ప్లాన్ ని కూడా బిఎస్ఎన్ఎల్ ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 786 ప్లాన్ లాగే ఫుల్ టాక్ టైం కూడా లభిస్తుంది. అయితే ఈ ఫుల్ టాక్ టైం కేవలం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే లభిస్తుంది. మిగతా సర్కిళ్లలో వారు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే కేవలం 158 .02 రూపాయలు మాత్రమే లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: