ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక కరోనా మహమ్మారి దెబ్బకు లాక్డౌన్ విధించడంతో చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అందరూ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి.. అది కూడా బడ్జెట్ ధరలోనే స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే.. పోకో నుంచి అద్భుతమైన ఫీచర్లతో పోకో ఎం2 ప్రో ఇండియన్ మార్కెట్లో విడుదలైంది.
ఈ స్మార్ట్ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. పోకో ఎం2 ప్రోలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జీ ప్రాసెసర్, క్వాడ్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి. ఔట్ ఆఫ్ ది బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ కలర్స్లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ.13,999 గా ఉంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను అందించారు.
4జీబీ, 6జీబీ, 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జీ ప్రాసెసర్తో ఈ స్మార్ట్ఫోన్ పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. 48+8+5+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా.. 16 మెగాపిక్సెల్ తో సెల్ఫీ కెమెరా ఇందులో అందించారు. అలాగే 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఇందుల ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ సిమ్ సపోర్ట్ అందించారు. ధర విషయానికి వస్తే.. 4జీబీ+64జీబీ- రూ.13,999, 6జీబీ+64జీబీ- రూ.14,999 మరియు 6జీబీ+128జీబీ- రూ.16,999 గా నిర్ణయించారు. మొదటి సేల్ ఫ్లిప్కార్ట్లో జూలై 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.