రెడ్ మీ... ప్రస్తుతం మనదేశంలో అతి తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న బ్రాండ్ రెడ్ మీ . ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ నుండి ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు రెడ్ మీ కూడా స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే రెడ్ మీ నోట్ 8 ధర పెరిగింది. 

 

IHG

 

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ మీద ధర పెంచారు. ఈ రెడ్ మీ 8 స్మార్ట్ ఫోన్ ను గతేడాది అక్టోబర్ లో లాంచ్ చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరతో రియల్ మీ నార్జో 10, శాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్ ఫోన్లతో పోటీ పడనుంది అనే చెప్పాలి. ఇక పోతే రెడ్ మీ నోట్ 8 ధర రూ.12,499కు చేరింది. ఇంతకు ముందు దీని ధర రూ.11,999గా ఉండేది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ పై ధర రూ.500 పెంచారు. 

 

IHG

 

స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు.. 

 

6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

 

4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 

 

వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు ఉన్నాయి. 

 

సెల్ఫీ కెమెరాకు 13 మెగా పిక్సెల్ అందించారు. 

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ఇందులో అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: