ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే అద్భుతమైన ఫీచర్లతో రోజుకో ఫోన్ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో.. విడుదలకు నోచుకోని ఫోన్లను వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో స్మార్ట్ఫోన్ భారత్ మార్కెట్లోకి విడుదలైంది. ప్రముఖ టెక్నో కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ 5 ప్రోను తాజాగా లాంచ్ చేసింది. ఈ సంవత్సరం మేలో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 5కు ప్రో మోడల్ గా ఇది లాంచ్ అయింది.
టెక్నో స్పార్క్ 5 ప్రోలో.. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందించారు. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.6 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అమర్చారు. మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్పై టెక్నో స్పార్క్ 5 ప్రో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ చేశారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మరో ఏఐ షూటర్ లను కూడా ఇందులో అందించారు.
ఇక 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను పంచ్ హోల్ లో అందించారు. అయితే ఈ స్మార్ట్ఫోన్ మరో విషేషం ఏంటంటే.. ఇందులో ఏకంగా 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న భారీ బ్యాటరీని అమర్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఓటీజీ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. టెక్నో స్పార్క్ 5 ప్రోను కేవలం రూ.10,499కే అందిస్తున్నారు. ఇక ఈ స్మార్ట్ఫోన్ ఐస్ జాడైట్, స్పార్క్ ఆరెంజ్, సీబెడ్ బ్లూ, క్లౌడ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.