ఈ కామర్స్ లో తిరుగులేకుండా దూసుకుని పోతోంది పేటీఎం సంస్థ.. వీరి నుంచి ఇప్పుడు సరికొత్త యాప్ వచ్చింది. పేటీఎం మాల్ అనే పేరుతో విడుదలయిన ఈ యాప్ లో భారతీయ వినియోగదారుల కోసం మాల్ , బజార్ సేవలని అందించబోతున్నట్టు తెలిపింది. ఇందులోకి బాగా నమ్మకస్తులైన విక్రయదారులను, మంచి నాణ్యత కలిగిన వస్తువులనే అనుమతిస్తామని పేటీఎం పేర్కొంది. షిప్పింగ్ సేవలు కూడా నాణ్యంగా ఉంటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 పేటీఎం మాల్ సెంటర్లు ఉన్నట్టు సంస్థ ఉపాధ్యక్షుడు సౌరభ్ వశిష్ఠ తెలిపారు. త్వరలోనే పేటీఎం మాల్ ఐఓఎస్‌ను కూడా విడుదల చేయనున్నట్టు సౌరభ్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: