సాధారణంగా ఐఫోన్ అనగానే అత్యంత ఖరీదైన ఫోన్ గా భావిస్తుంటారు. వాస్తవానికి దాని రేటు కూడా అదే రేంజ్ లో ఉంటుంది. దాంతో చాలా మంది స్మార్ట్ ఫోన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం పేటీయం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. రూ.27,200 విలువ చేసే ఐఫోన్ ఎస్ఈ32జీబీ ఫోన్ ను కేవలం 5990 రూపాయలకే అందిస్తోంది. వింటానికి ఇంది ఆశ్చర్యంగా ఉన్నా నూటికి నూరు శాతం నిజం.
ఇక అసలు విషయానికి వస్తే.. ఫోన్ ధర రూ.27,200గా ఉంది. 15% డిస్కౌంట్ తో రూ.22,990లకే వస్తోంది. ఇంకా మరిన్ని డిస్కౌంట్స్ డిస్కౌంట్లు ప్రకటించింది పేటీయం. దీని ప్రకారం 3 వేల రూపాయలు క్యాష్ బ్యాక్ రానుంది. దీంతో పాటు రూ.2000 ఫ్లైట్ వోచర్, రూ.2000 ఫ్యాషన్ కూపన్, రూ.1000 మొబైల్ యాక్ససరీస్ కూపన్ ఇవ్వనుంది.
ఇవన్నీ కలుపుకుంటే(3000+2000+2000+1000) .. రూ.8000లు అవుతున్నాయి. అంటే మొత్తం ఐఫోన్ ధర మీకు 14,999 కి వస్తున్నట్లు లెక్క. మరో అద్భుతమైన ఆఫర్ ఏంటంటే.. ఏడాదిలోగా ఎప్పుడు ఫోన్ రిటర్న్ ఇచ్చేసినా రూ.9000 వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 5,990 రూపాయలు మాత్రమే. అంటే 6వేలు రూపాయలకే మీకు ఐ ఫోన్ వస్తుంది.
ఇక ఐఫోన్ ప్రత్యేకతలు :
4 – ఇంచ్ డిస్ ప్లే
1136×640 రిజల్యూషన్
12MP కెమేరా
A9 చిప్ M9 మోషన్ కోప్రాసెసర్
4K వీడియో రికార్డింగ్
HD కెమేరా
టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్
4G LTE1 up to 150 Mbps and 802.11a/b/g/n/ac Wi-Fi
iOS 10 & iCloud