భారత దేశంలో ఇప్పుడు మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మొబైల్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇక నెట్ వర్క్ సంస్థల్లో కూడా ఈ మద్య కాంపిటీషన్ పెరిగిపోవడంతో యూజర్ చార్జీలు బాగా తగ్గస్తూ..కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇక రియలన్స్ జియో వచ్చినప్పటి నుంచి నెట్ వర్క్ సంస్థల్లో పెను మార్పులు వస్తున్నాయి.
తాజాగా జియో 4జీ ఫీచర్ ఫోన్కు దీటుగా ఎయిర్టెల్ మరో ఫోన్తో ముందుకొస్తోంది. ఇందుకోసం దేశీయ మొబైల్ ఫోన్ మేకర్ సెల్కాన్తో చేతులు కలిపింది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్ఫోన్’ కార్యక్రమంలో భాగంగా రూ.1349కే 4జీ స్మార్ట్ఫోన్ను తీసుకొస్తోంది. ఈ ఫోన్ కోసం వినియోగదారులు తొలుత రూ.2,849 చెల్లించాల్సి ఉంటుంది. 36 నెలలపాటు క్రమం తప్పకుండా నెలకు రూ.169 చొప్పున రీచార్జ్ చేసుకోవాలి. అలా చేసుకున్న ఖాతాదారులకు 18 నెలల తర్వాత రూ.500 వెనక్కి వస్తాయి. మిగతా 18 నెలలు పూర్తయ్యాక మరో రూ.1000కు ఎయిర్టెల్ వెనక్కి ఇస్తుంది. ఈ లెక్కన ఫోన్ రూ.1349కే లభిస్తుందన్నమాట.
సెల్ ఫోన్ ఫీచర్స్ :
సెల్కాన్ తయారు చేస్తున్న ఈ 4జీ స్మార్ట్ఫోన్లో 4 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఓఎస్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 32 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లో వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ టీవీ, మై ఎయిర్టెల్ యాప్ వంటివి యాప్స్ ప్రీలోడెడ్గా వస్తాయి.