భారత దేశంలో ఈ మద్య చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.  ఇక స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు చాలా మంది సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నారు.  ఇక భారత దేశంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్ యాప్ బాగా వాడుతున్నారు.  మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌తో యూజర్ల ముందుకు వచ్చేసింది. స్నేహితులు పంపే యూట్యూబ్ వీడియోను వీక్షిస్తూనే చాట్‌ను కొనసాగించే అవకాశాన్ని కల్పించేలా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

కొన్ని సార్లు యూట్యూబ్ వీడియోలను పంపితే అది యూట్యూబ్ యాప్‌లో ప్లే అయ్యేది.  ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌ వల్ల వాట్సాప్‌ను వీడకుండానే యూట్యూబ్ వీడియోలను వీక్షించేందుకు అవకాశం యూజర్లకు లభించింది.

చాట్ చేస్తూనే అక్కడే ఆ వీడియోను ప్లే చేసి చూసుకోవచ్చు. ఐవోఎస్ వినియోగదారుల కోసమే ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: