ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.499కే అత్యంత చవకగా మొబైల్ను అందించనుంది. ‘డీటెల్ డీ1’ పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్ను తాజాగా విడుదల చేసింది బీఎస్ఎన్ఎల్. ఈ బండిల్ ఆఫర్లో వినియోగదారుడు రూ.499కే డిటెల్ డీ1 మొబైల్, బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ పొందుతాడు. 365 రోజుల వ్యాలిడిటీతో రూ.103 టాక్టైమ్ లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్కు ప్రతి నిమిషానికి 15 పైసలు, బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్వర్క్లకు నిమిషానికి 40 పైసలు కాల్రేట్గా నిర్ణయించారు. వినియోగదారుడికి ఉచితంగా 28 రోజుల వరకు రింగ్బ్యాక్ టోన్ సౌకర్యం కల్పించారు.
డీ1 మొబైల్లో 1.44 అంగుళాల తెర, 650 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్క సిమ్ మాత్రమే పనిచేస్తుంది. టార్చ్లైట్, ఫోన్బుక్, ఎఫ్ఎం రేడియో, స్పీకర్, వైబ్రేషన్ మోడ్ ఉంటాయి. దేశంలోని నలుమూలల తమ నెట్వర్క్ను విస్తరించాలన్న ధ్యేయంతో ముందుకు వెళుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.