గత కొంత కాలంగా భారత టెలీకాం రంగంలో ఎన్నో మార్పులు సంబవిస్తున్నాయి.  ముఖ్యంగా జియో వచ్చినప్పటి నుంచి ఇతర ఇతర నెట్ వర్క్ సంస్థలకు కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు పెడుతూ..కస్టమర్లను ఆకర్షిస్తున్న జియోని డామినేట్ చేయాలంటే..దాని బాటలోనే నడవాల్సి వస్తుంది..ఇతర నెట్ వర్క్ సంస్థలకు.

తాజాగా టెలికాం సంస్థ జియోపై ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు ముప్పేట దాడి చేస్తున్నాయి. జియో ఇప్పటికే పలు పాత ప్లాన్లను మార్చి కొత్త ప్లాన్లను రూ.50 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులోకి తేవడమే కాకుండా, పలు ఇతర ప్యాక్‌లపై 50 శాతం అదనపు డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే. 


జియోలో రూ.449, రూ.498 ప్లాన్లు 91 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా, వీటిలో కస్టమర్లకు వరుసగా రోజుకు 1జీబీ, 1.5 జీబీ డేటా లభిస్తున్నది.
Image result for jio
ఐడియాలో రూ.449 ప్లాన్ గతంలో 70 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా అది ఇప్పుడు 82 రోజులు అయింది. డేటా 70 జీబీకి బదులుగా 82 జీబీ వస్తుంది. ఇందులో ఉన్న రూ.509 ప్లాన్ వాలిడిటీ గతంలో 84 రోజులు ఉండగా అదిప్పుడు 91 రోజులు అయింది. దీంతో ప్రస్తుతం 91జీబీ డేటా వస్తుంది. 

Image result for idea

ఎయిర్‌టెల్‌లో ఉన్న రూ.448 ప్లాన్‌లో ఇప్పటి వరకు 70 రోజులకు గాను రోజుకు 1 జీబీ డేటా చొప్పున మొత్తం 70 జీబీ డేటా అందేది. అయితే ఇప్పుడీ ప్లాన్ వాలిడిటీని 82 రోజులు చేశారు. దీంతో ఇప్పుడు రోజుకు 1జీబీ డేటా చొప్పున 82 జీబీ డేటా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు లభిస్తుంది. అలాగే రూ.509 ప్లాన్‌లో ఇది వరకు 84 రోజుల వాలిడిటీ ఉండగా దాన్ని ఇప్పుడు 91 రోజులకు పెంచారు. దీంతో అందులో రోజుకు 1జీబీ డేటా చొప్పున 91 జీబీ డేటా ఇప్పుడు కస్టమర్లకు లభిస్తుంది. 

Image result for airtel
వొడాఫోన్‌లో రూ.458 ప్లాన్ గతంలో 70 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా అది ఇప్పుడు 84 రోజులు అయింది. డేటా 70 జీబీకి బదులుగా 84 జీబీ వస్తుంది. ఇందులోనే ఉన్న రూ.509 ప్లాన్ వాలిడిటీ గతంలో 84 రోజులు ఉండగా అదిప్పుడు 91 రోజులు అయింది. దీంతో ప్రస్తుతం 91జీబీ డేటా వస్తుంది. 

Image result for vodafone



మరింత సమాచారం తెలుసుకోండి: