జియో ప్రైమ్ మెంబ‌ర్ల కోసం ఓ ప్ర‌త్యేక రీఛార్జీ ఆఫ‌ర్‌ను జియో ప్ర‌వేశ‌పెట్టింది. రూ. 398 రూపాయలు, ఆపై రీఛార్జ్‌లపై మొత్తం 700 రూపాయల వరకు అంటే 100 శాతం పైగా క్యాష్‌బ్యాక్‌ను పొందే అవ‌కాశాన్ని క‌ల్పించింది జియో. ఈ ఆఫర్‌' జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండ‌నుంది. క్యాష్‌బ్యాక్ పొందాలంటే జియో టారిఫ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌, డిజిటల్‌ వాలెట్ల ద్వారానే ల‌భించ‌నుంది.
Jio's 'Get More Than 100% Cashback Offer' Gives Up To Rs. 700 Cashback - Sakshi
ఈ ఆఫర్ కేవలం జియో ప్రైమ్ మెంబ‌ర్ షిప్ ఉన్నవారికి మాత్రమే వర్తించనుంది.398 రూపాయలు, లేదా ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై 400 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను, ఎనిమిది రూ. 50 వోచర్ల రూపంలో అందిస్తోంది.

ఈ వోచర్లను తర్వాత చేసుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రిడీమ్‌ చేసుకోవచ్చు. ఇక డిజిట‌ల్ వాలెట్ల విష‌యానికి వ‌స్తే... ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే, భీమ్‌, యాక్సిస్‌పే ద్వారా పేమెంట్‌ చేసిన జియో ప్రైమ్‌ మెంబర్లకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ కింద రూ.300 వరకు అందించ‌నుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: