స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్-సిరీస్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మోడల్స్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ను విడుదల చేసిన అనంతరం, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్8 64జీబీ మోడల్ రూ.49,990కు, గెలాక్సీ ఎస్8 ప్లస్ 64జీబీ మోడల్ రూ.53,990కు అందుబాటులో ఉంది.
గెలాక్సీ ఎస్8ప్లస్ 128జీబీ మోడల్ ధరను రూ.64,900కు తగ్గించింది. అంటే అంతకముందు ధరలతో పోలిస్తే గెలాక్సీ ఎస్8పై 8వేల రూపాయల డిస్కౌంట్ను, గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్ఫోన్పై 11వేల రూపాయల డిస్కౌంట్ను శాంసంగ్ ప్రకటించింది. ఈ తగ్గించిన ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లోనూ, శాంసంగ్ అధికారిక రిటైల్ ఛానల్స్లోనూ అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లను ఆఫ్లైన్లో కొనుగోలు చేయాలనుకునే వారు రూ.10వేల పేటీఎం క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చు.ఇటీవలే గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్లను విడుదల చేసిన సందర్భంగా గెలాక్సీ ఎస్8 ఫోన్ల ధరలను తగ్గించినట్టు శాంసంగ్ వెల్లడించింది.